చిన్నప్పుడే ముద్దు రుచి చూశా: ప్రియాంకా చోప్రా

"నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే సడన్‌గా ఓ అబ్బాయి నా వద్దకు వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు. నాకు షాక్. అతనివైపు అలా చూస్తుండిపోయా. ఇదే సీన్ ఆ మధ్య ఓ చిత్రంలో దర్శకుడు చెపితే... ఒక్కసారి గతం గుర్తుకువచ్చింది. నాకు సుస్మితాసేన్ అంటే ఆరాధన. ఆమె విశ్వసుందరి కిరీటాన్ని ధరించడం టీవీల్లో చూశాను. ఎప్పటికైనా ఆ స్థాయికి చేరకపోతానా అనిపించింది. అప్పుడే అందంపై ఆరాధన పెరిగింద"ని అదే తనను ఇంతటి స్థాయికి తెచ్చిందని తన అనుభవాలను చెపుతోంది ప్రియాంకా చోప్రా.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2010 | 8:19 am

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా

భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాను మంగళవారం లాంఛనంగా పొందారు. గతంలో భాజపా సీనియర్ నేత ఎల్‌ కె అద్వానీ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న విషయం విదితమే.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 8:13 am

చార్జీలు వడ్డన లేని రైలు బడ్జెట్..?!!

పేదలపక్షం నిలుస్తామని చెప్పే రైల్వేమంత్రి మమతా బెనర్జీ తను ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై భారం మోపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ప్రయాణికుల రైలు చార్జీలు పెంచాల్సిన అగత్యం ఏర్పడితే, ప్రత్యేకించి ఎంపిక చేసిన క్లాసులపైనే భారం మోపాలన్న యోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 8:08 am

పుంజుకున్న కొనుగోళ్లు: లాభాల్లో స్టాక్ మార్కెట్

మంగళవారం దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తిరిగి లాభాలను నమోదు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 57 పాయింట్లు వృద్ధి చెంది, 16,294 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి, 4,882 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 7:55 am

25న ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ బోర్డ్ మీటింగ్

రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ నెల 25న సమావేశం కానుంది. ఈ మేరకు గురువారం జరిగే ఈ బోర్డు మీటింగ్‌లో హోల్ సేల్ ట్రేడింగ్ పునర్నిమాణం మరియు వాణిజ్యాభివృద్ధిపై చర్చలు జరుగుతాయని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 7:47 am

లాభాల బాటలోనే సెన్సెక్స్, నిఫ్టీల పయనం

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్‌కు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఊతమిచ్చింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 71 పాయింట్ల మేర లాభపడి, 16,308 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్లు వృద్ధి చెంది, 4,874 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 7:24 am

ధరల పెరుగుదలపై చర్చించేందుకు సిద్ధం: ప్రధాని

లోక్‌‍సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ధరలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 7:03 am

ఆఫ్గన్‌లో మృతి చెందిన యూఎస్ సైనికుల సంఖ్య వెయ్యి

ఆఫ్గనిస్థాన్‌లోని అమెరికాకు చెందిన సైనికుల్లో మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి వెయ్యికి చేరుకుందని ఓ వెబ్‌సైట్ పేర్కొంది. ఆఫ్గనిస్థాన్ దేశంలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచి ఎనిమిది సంవత్సరాలకుపైనే అయ్యిందని ఐక్యాస్యువాలిటీస్ అనే వెబ్‌సైట్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 6:30 am

స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్‌పై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రభావం పడింది. సోమవారం లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మంగళవారం కూడా వృద్ధిబాటలోనే ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో ఆసియా మార్కెట్ల ప్రభావంతో తిరోగమనంలో పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 46 పాయింట్లు పుంజుకుని, 16,283 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో 4,870 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 6:28 am

నాగ్.. నన్ను సెక్సీ అని కూడా పిలుస్తారు: మమతా

నాగార్జునకు మమతా మోహన్ దాస్ అంటే చాలా ఇష్టం. "కింగ్"లో నాగ్ సోదరుని భార్యగా నటించింది. ఆమె నటించిన తీరు నాగ్‌ను ఆకట్టుకుంది. దాంతో ఆమెకు ఎలాగైనా తర్వాత చిత్రంలో ఆఫర్ ఇవ్వాలని "కేడి" చిత్రంలో ఇచ్చారు. తనకు నచ్చిన నాయిక మమతా మోహన్ దాస్ అని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని మమత ముందు ప్రస్తావిస్తే... "ఈ విషయాన్ని నాగ్ నాతోనూ చెప్పారు. ఆయన అంతటితో ఆగరు. బ్యూటీ, సెక్సీ అని పిలుస్తారు. నటన, గానంతోపాటు నీలో ఎన్నో నైపుణ్యాలున్నాయని కూడా మెచ్చుకుంటారు. ఇంకా కష్టపడితే పైకొస్తావ్ అని కూడా చెపుతుంటారు. నిజంగా నాగ్ ఈజ్ గ్రేట్. ఆయనతో ఎన్ని చిత్రాలు చేయడానికైనా నేను రెడీ" అంటూ గలగలా నవ్వుతూ చెప్పింది మమత.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2010 | 5:59 am

రేపటికి వాయిదాపడ్డ ఉభయ సభలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలతో లోక్‌సభతోపాటు రాజ్యసభలోను ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఎగువసభ, దిగువసభలు రెండూ వాయిదా పడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 5:58 am

లాభాల్లో కొనసాగుతోన్న సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ తేలికపాటి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 32 పాయింట్లు పుంజుకుని, 16,269 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో, 4,865 పాయింట్లు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Feb 2010 | 5:39 am

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా

భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాను మంగళవారం లాంఛనంగా పొందారు. గతంలో భాజపా సీనియర్ నేత ఎల్‌ కె అద్వానీ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న విషయం విదితమే.
Source: జాతీయ | 23 Feb 2010 | 2:46 am

చార్జీలు వడ్డన లేని రైలు బడ్జెట్..?!!

పేదలపక్షం నిలుస్తామని చెప్పే రైల్వేమంత్రి మమతా బెనర్జీ తను ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై భారం మోపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ప్రయాణికుల రైలు చార్జీలు పెంచాల్సిన అగత్యం ఏర్పడితే, ప్రత్యేకించి ఎంపిక చేసిన క్లాసులపైనే భారం మోపాలన్న యోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 23 Feb 2010 | 2:39 am

ధరల పెరుగుదలపై చర్చించేందుకు సిద్ధం: ప్రధాని

లోక్‌‍సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ధరలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
Source: జాతీయ | 23 Feb 2010 | 1:34 am

రేపటికి వాయిదాపడ్డ ఉభయ సభలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ధరలతో లోక్‌సభతోపాటు రాజ్యసభలోను ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఎగువసభ, దిగువసభలు రెండూ వాయిదా పడ్డాయి.
Source: జాతీయ | 23 Feb 2010 | 12:29 am

రాళ్లు వేసినా కాస్త ఓపిక పట్టమని చెపుతున్నా: రోశయ్య

తెలంగాణాకోసం యువతీయువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేయడం పట్ల ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ... సమస్య చాలా సున్నితమైనది కనుక అందరూ సంయమనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 12:02 am

గంటపాటు వాయిదాపడిన అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం వరుసగా మూడోసారి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. సభాపతి వారించినప్పటికీ సభ్యులు శాంతించలేదు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 11:31 pm

మావోలు హింసను వీడి చర్చలకు రండి: చిదంబరం

మావోయిస్టులు దేశంలో హింసను విడనాడి తమతో చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం మంగళవారం మావోలకు పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 22 Feb 2010 | 11:17 pm

తెలంగాణకన్నా ముస్లిం రిజర్వేషన్లే ముఖ్యం: అసదుద్దీన్‌

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ అంశంకన్నా ముస్లింలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు చాలా కీలకమైనవని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లింల రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్‌కు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 10:59 pm

భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డ మావోయిస్టులు

కాల్పులను 72 రోజులపాటు విరిమిస్తున్నామని సిపిఐ (మావోయిస్టు) నాయకుడు కిషన్‌‍జీ ప్రకటించి కొన్ని గంటలు కూడా గడవకమునుపే సోమవారం రాత్రి పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కాంటాపహారీ ప్రాంతంలోనున్న భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు.
Source: జాతీయ | 22 Feb 2010 | 9:52 pm

ఓటర్ల జాబితాలో ఫొటో తప్పనిసరి: సుప్రీం

దేశంలోని పౌరులకు అందజేస్తున్న ఓటర్ల జాబితాలో ముస్లిం మహిళల పేర్లతోపాటు వారి ఫోటోలు కూడా ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది.
Source: జాతీయ | 22 Feb 2010 | 8:16 pm

నాగచైతన్య - కాజల్ కాంబినేషన్లో శివప్రసాద్ రెడ్డి చిత్రం

యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం మార్చిలో ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... కామాక్షి బ్యానర్ సిల్వర్ జూబ్లి ఇయర్లో నాగచైతన్య హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అజయ్ భూయాన్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. విఎస్ జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంకోసం లొకేషన్స్ సెలెక్ట్ చేయడానికి డైరెక్టర్ యూఎస్ వెళ్లారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2010 | 1:04 pm

చర్చలకు సిద్ధం: మావోయిస్టు నేత కిషన్ జీ

మావోయిస్టు నేత కిషన్ జీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకారం తెలుపుతున్నట్లు ప్రకటించాడు. కేంద్ర హోం మంత్రి చిదంబరం కోరినట్లు 72 రోజులపాటు కాల్పుల విరమణకు అంగీకారిస్తున్నట్లు ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ద్వారా తెలియజేశారు. అయితే మావోయిస్టులకోసం కేంద్రం చేస్తున్న గ్రీన్ హంట్‌ను నిలిపి వేయాలని కిషన్ జీ కోరారు.
Source: జాతీయ | 22 Feb 2010 | 9:10 am

మీ వెకిలి చేష్టల వల్లే లక్ష్యం వెనక్కి: జానారెడ్డి ఆగ్రహం!

రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ఆందోళనకారులు చేస్తున్న వెకిలి చేష్టల వల్లే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి కుందూరు జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 7:59 am

విభజన ఉద్యమాలకు ఐఎస్ఐ దన్ను: తెలంగాణాపై నీలినీడలు

దేశంలో విభజన ఉద్యమాలు మరిన్ని ఊపందుకునేటట్లు చేసి తద్వారా భారతదేశాన్ని అతలాకుతలం చేసే దిశగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని భారతదేశ నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి.
Source: జాతీయ | 22 Feb 2010 | 7:56 am

శ్రీకృష్ణపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తదుపరి కార్యాచరణ ప్రణాళికను నిలిపివేయాలంటూ సోమవారం ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 7:19 am

తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించని కేంద్రం: కేసీఆర్

నాలుగు కోట్ల మంది ప్రజలు ఏకమై చేస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. దీనిపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన రెండు వేల మంది న్యాయవాదులు పార్లమెంట్ వెలుపల ఆందోళన చేస్తే వారిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 7:15 am

మన్మోహన్‌జీ... మా గోడు ఆలకించరూ: టి ఎంపీల మొర!

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు సోమవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో సమావేశమై తమ విజ్ఞాపనలను ఆలపించాలని మొరపెట్టుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులపై హోంశాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాను మార్చాలని వారు కోరారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 7:14 am

ఏవీఎస్ దర్శకత్వంలో కృష్ణుడి "కోతీమూక"

హాస్య నటుడు ఏవీఎస్ దర్శకత్వం వహిస్తున్న నాల్గవ చిత్రం కోతిమూక. తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్. కె మోహన్ కుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభమైంది. హీరో కృష్ణుడు, హీరోయిన్ శ్రద్ధ ఆర్యపై ముహూర్తపు షాట్ తీశారు. రామానాయుడు క్లాప్ కొట్టగా, సి. కల్యాణ్ కెమేరా స్విచాన్ చేశారు. మురళీ మోహన్ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2010 | 6:58 am

ఈనెల 27 నుంచి ప్రధాని సౌదీ అరేబియా పయనం!

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈనెల 27వ తేదీ నుంచి సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో భారత్-సౌదీ అరేబియాల మధ్య తొమ్మిది కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
Source: జాతీయ | 22 Feb 2010 | 6:12 am

నమిత చాలా చాలా చాలా హాట్ గురూ..!!

సెక్సీ బాంబ్ నమిత బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌కు ఫుల్ కాంపిటీషన్ ఇస్తోంది. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా గూగుల్ శోధనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఎందరో ఇండియన్ హాటెస్ట్ బ్యూటీలను మట్టి గరిపించింది. టాప్ సెర్చర్స్‌లో నమిత అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. దక్షిణాది తారలలో అంతకుముందు నయనతార ముందడుగులో ఉండేది. కానీ నయనను బీట్ చేస్తూ నమిత ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. నమిత తర్వాత త్రిష, శ్రేయ, మమతా మోహన్ దాస్ హాటెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గూగుల్ సెర్చ్‌లో వెల్లడైంది. టాప్ టెన్ సెర్చ్ లిస్ట్‌లో నమితతో పాటు కత్రినాకైఫ్ మాత్రమే భారతదేశం నుంచి ఉన్నారంటే ఈ తారల పట్ల ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. నమిత హోమ్లీ క్యారెక్టర్స్ చేసినంతకాలం అంతగా పేరు రాలేదు. చివరికి హాట్ అవతారం ఎత్తిన తర్వాత ఆమెను టీనేజ్ కుర్రకారు ఆకాశానికి ఎత్తేశారు. ఏదైనా కొత్త స్టిల్స్ వస్తే చాలు నమిత అందాలను ఆస్వాదించేందుకు నెట్ ప్రియులు ఎగబడుతున్నట్లు గూగుల్ శోధన ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2010 | 6:05 am