శ్రీలంకకు రూ.2050 కోట్లు సాయం చేసిన చైనా!

శ్రీలంకలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు చైనా భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసింది. రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం తదితర పనులకుగాను మొత్తం 2050 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని చైనా అందజేసింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిధులతో రోడ్లు రైలు రహదారులు, విమానాశ్రయాలు తదితర నిర్మాణాల కోసం చేపడుతారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 8:16 am

తక్కువ ఉత్పత్తితో పెరిగిన బియ్యం ధరలు

ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో బియ్యం కొనుగోలు తక్కువగానే జరిగింది. అదే పంజాబ్, హర్యానా ప్రాంతాలలో బియ్యం ఎక్కువగా కొనుగోలు చేశారు. అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకున్న సీజన్‌లో ఇప్పటి వరకు 1,485 కోట్ల టన్నుల బియ్యం కొనుగోలు చేశారు. నిరుడు ఇదే కాలానికి 1,439 కోట్ల టన్నుల బియ్యాన్ని కొనడం జరిగిందని కేంద్ర వ్యవసాయమంత్రిత్వ శాఖాధికారులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 8:11 am

వేర్పాటువాదుల ఆందోళనలు అర్థరహితం: వైఎస్ వివేకా

ప్రత్యేక రాష్ట్రం కోసం వేర్పాటు వాదులు చేస్తున్న ఆందోళనలు అర్థరహితంగా ఉన్నాయని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆరు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు ఆరు రోజుల్లో పరిష్కారం కనుగొనాలని మంకుపట్టుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 7:54 am

గవర్నర్ ఎన్డీ తివారీని రీకాల్ చేయనున్న కేంద్రం!

తన పరిపాలనా కార్యాలయమైన రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారపూర్వక ఉత్తర్వులు శనివారం సాయంత్రం లోగా వెలువడే అవకశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 7:45 am

అటు తెలంగాణా రభస.. ఇటు గవర్నర్ రాసలీల...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఏ గతిన పోతుందో తెలియని దుస్థితి నేడు నెలకొంది. ఒకవైపు ప్రత్యేక తెలంగాణా అంశంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయి శాంతిభద్రతల సమస్య అధ్వాన్నమైపోతుంటే, వాటిని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రధమ పౌరుడు గవర్నర్ రాసలీలల్లో తేలియాడుతున్నట్లు పలు వార్తా కథనాల ద్వారా ద్యోతమవుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 7:45 am

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు: నాగం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 7:32 am

ప్రతి ఒక్కరికి ఉద్యాగాలు అవసరం: ప్రణబ్

దేశంలో నానాటికీ నిరుద్యోగ సంఖ్య పెరిగిపోతోందని, అలాగే వ్యవసాయంపై ఆధారపడటం కష్టసాధ్యమౌతోందని, దీనికి ప్రతి ఒక్కరికి ఉపాధి కొరకు ఉద్యోగాలు చాలా అవసరమని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 7:00 am

ముడి చమురు ధరలు పెరగవచ్చు: సౌదీ రాజు

న్యాయబద్దంగా ముడి చమురు ధరలు పెరగనున్నాయని, అది ప్రతి బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్ల నుండి 80 డాలర్ల మేరకుంటుందని సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా రియాద్‌లో కువైట్ వార్తా పత్రిక అల్- సేయాస్సాహ్‌కు వివరించారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 6:32 am

జేఎంఎం-భాజపాల నేతృత్వంలో జార్ఖండ్‌ ప్రభుత్వం!

ఎన్నికల ఫలితాల అనంతరం హంగ్ అసెంబ్లీ ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్ఛాలు చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏకమై.. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 6:29 am

30 దాటక ముందే పెళ్లి చేసుకుంటా: ఇలియానా

సగటు అమ్మాయి లాగానే తన మనసు కూడా పెళ్లి గురించి ఎన్నెన్నో కలలు కంటుందని అందాల ముద్దుగుమ్మ, కిక్ సుందరి ఇలియానా అంటోంది. సినిమా స్టార్ అయితే ఊహలు ఆకాశంలో ఉండవని, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలని కలలు కంటున్నానని ఇలియానా చెబుతోంది. తనకు భర్తగా కాబోయే వ్యక్తి రొమాంటిక్‌గా ఉండాలని ఇలియానా మనసులోని మాటను బయటపెట్టింది. ఇంకా తన జీవిత భాగస్వామి గురించి ఇలియానా ఎలా ఉండాలంటుందంటే..? అందంగా లేకపోయినా తనతో అబద్ధాలు మాత్రం ఆడకూడదట. అసత్యాలు పలికేవారంటే ఆమెకు అలర్టీ అట. ముప్ఫై దాటకుండానే పెళ్లి చేసుకోవాలట.. ఇలా పలు విషయాలను చెప్పుకొచ్చింది.ఇంకా ఏమంటుందంటే..? కొన్ని విషయాలు వయస్సులో ఉండగానే బాగుంటాయి. తనకు నచ్చినవాడినే పెళ్లాడుతాను. పిల్లల్ని కనడం, భర్తకు రుచిగా వండి పెట్టడంలో ఉన్న థ్రిల్‌ను ఓ సగటు మహిళగా అనుభవించాలి" అని ఎంతో ఆశపడుతున్నానని చెప్పింది. ఇంకేముంది..? కాబోయే భర్త, జీవితంపై ఇలియానా కలలు త్వరలో ఫలించాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..?.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 6:09 am

ముషారఫ్ అనుమతితోనే బెనజీర్ భుట్టో హత్య!

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టోను అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అనుమతితోనే తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) నేత బైతుల్లా మెసూద్ హత్య చేయించాడని బ్రిటన్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ వాజిద్ షాంసూల్ హాసన్ ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 26 Dec 2009 | 6:03 am

జనవరి 1 నుంచి ఇ.వి.వి- ఆర్యన్ రాజేష్‌ల కొత్త చిత్రం!

హిట్ చిత్రాల కథానాయకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కొత్త సంవత్సరంలో తన తదుపరి చిత్రానికి సమాయత్తమవుతున్నారు. బిగ్‌బి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ హీరోగా, ఐశ్వర్య (పరిచయం) హీరోయిన్‌గా నటించనున్నారు. రెండున్నర గంటల పాటు నాన్‌-స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే "బెండు అప్పారావు ఆర్.ఎం.పి" వంటి హాస్యభరిత చిత్రాన్ని అందించిన ఈవీవీ తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పటివరకు తీసిన కామెడీ చిత్రాల్లో అత్యుత్తమైనదిగా నిలిచేందుకు స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 5:48 am

వేర్పాటువాదుల ఆందోళనలు అర్థరహితం: వైఎస్ వివేకా

ప్రత్యేక రాష్ట్రం కోసం వేర్పాటు వాదులు చేస్తున్న ఆందోళనలు అర్థరహితంగా ఉన్నాయని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆరు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు ఆరు రోజుల్లో పరిష్కారం కనుగొనాలని మంకుపట్టుపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 2:25 am

గవర్నర్ ఎన్డీ తివారీని రీకాల్ చేయనున్న కేంద్రం!

తన పరిపాలనా కార్యాలయమైన రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారపూర్వక ఉత్తర్వులు శనివారం సాయంత్రం లోగా వెలువడే అవకశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Source: జాతీయ | 26 Dec 2009 | 2:19 am

అటు తెలంగాణా రభస.. ఇటు గవర్నర్ రాసలీల...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఏ గతిన పోతుందో తెలియని దుస్థితి నేడు నెలకొంది. ఒకవైపు ప్రత్యేక తెలంగాణా అంశంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయి శాంతిభద్రతల సమస్య అధ్వాన్నమైపోతుంటే, వాటిని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రధమ పౌరుడు గవర్నర్ రాసలీలల్లో తేలియాడుతున్నట్లు పలు వార్తా కథనాల ద్వారా ద్యోతమవుతోంది.
Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 2:19 am

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు: నాగం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 2:03 am

జేఎంఎం-భాజపాల నేతృత్వంలో జార్ఖండ్‌ ప్రభుత్వం!

ఎన్నికల ఫలితాల అనంతరం హంగ్ అసెంబ్లీ ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్ఛాలు చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏకమై.. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
Source: జాతీయ | 26 Dec 2009 | 12:59 am

జేఏసీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి!

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)తో చేతులు కలుపబోమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలంటూ ఉన్నాయని, వాటికి లోబడే తాము నడుచుకుంటామన్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 11:20 pm

ఉద్యమాలతో రోజుకు రూ.100 కోట్ల నష్టం: రోశయ్య

రాష్ట్రంలో గత నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు, ఉద్యమాలతో రోజుకు వంద కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితో రాష్ట్ర పాలన సాగించడం బహు దుర్లభమని ఆయన తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 11:14 pm

గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరింత ఉధృతం!

గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని గూర్ఖా జనముక్తి మోర్ఛా (జీజేఎం) నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఈనెల 28వ తేదీ నుంచి సరికొత్త ఉద్యమానికి పిలుపునిచ్చింది.
Source: జాతీయ | 25 Dec 2009 | 10:44 pm

పాలమూరు జిల్లా బంద్: కదలని ఆర్టీసీ చక్రాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో శనివారం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో మరోమారు పౌరజీవనం స్తంభించి పోయింది. ఆర్టీసీ బస్సులను డిపోల నుంచి బయటకు పంపేందుకు అధికారులు సాహసం చేయలేదు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 10:35 pm

రాజధానిలోని కీలక ప్రాంతాల్లో బలగాల మొహరింపు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరించారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ బలగాలను బందోబస్తు సంఖ్యలో నియమించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 10:27 pm

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేవీఎం యత్నాలు!

హంగ్ అసెంబ్లీ ఏర్పడిన జార్ఖండ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజాతాంత్రిక్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరికొంతమంది స్వతంత్రులతో కలిసి జేఎంఎం చీఫ్ శిబూ సోరేన్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నాయి.
Source: జాతీయ | 25 Dec 2009 | 9:12 pm

స్వతంత్రంగా ధృవీకరణ జరిపిస్తాం: కాంగ్రెస్ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీపై వచ్చిన రాసలీలల ఆరోపణలపై స్వతంత్రంగా ధృవీకరణ జరిపించి ఓ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల దీనిపై మరింత లోతుగా వ్యాఖ్యానించడం లేదా విశ్లేషించడం మంచిదికాదన్నారు.
Source: జాతీయ | 25 Dec 2009 | 9:06 pm

కేంద్రానికి తెలంగాణ జేఏసీ అల్టిమేటం

వచ్చే సోమవారం లోపల ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మొన్న 48 గంటలపాటు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో బంద్ పాటించాలనుకున్న విషయం విదితమే. అయితే శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజు బంద్‌కి సడలింపునిచ్చారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి హాలులో శుక్రవారం మధ్యాహ్నం సమావేశమైన తెలంగాణ జేఏసీ ఈ మేరకు తీర్మానించింది.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 6:30 am

చీలిన ప్రజారాజ్యం- ప్రజా తెలంగాణ సమితిగా ఆవిర్భావం

ప్రజారాజ్యం పార్టీలో చీలికలు ప్రారంభమైంది. ఆ పార్టీకి చెందిన కొందుర తెలంగాణ ప్రాంత నాయకులు తమ పార్టీని వీడి ప్రజా తెలంగాణ సమితి(పిటిఎస్) అనే కొత్త పార్టీని పెట్టారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 5:48 am

రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులు

ఎట్టకేలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులంతా శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం ఈ నెల 23న చేసిన దిద్దుబాటు ప్రకటన అయోమయానికి గురిచేసిందని, ఆ ప్రకటనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణీత గడువు లేకపోవడంతో తామంతా మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు మంత్రులు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 5:43 am

సీఆర్‌పీఎఫ్ దళాలపై దాడులు, ఏడుగురికి గాయాలు

ఉత్తర కాశ్మీరులోని బారాముల్లా జిల్లాలోనున్న సోపోర్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు జవాన్లతోపాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనాయి.
Source: జాతీయ | 25 Dec 2009 | 5:10 am

వాజ్‌పేయితో విభేదించిన అద్వానీ

తన చిరకాల మిత్రుడు, తన తోటి రాజకీయ నాయకుడైన వాజ్‌పేయితో తాను గతంలో విబేధించానని మాజీ ఉప ప్రధాని అద్వానీ వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 25 Dec 2009 | 3:40 am