రాహుల్ పట్టించుకోలేదు... మీరైనా న్యాయం చేయండి

అమేథీలోని ముషింగంజ్ అతిథి గృహానికి వెళుతున్న ప్రియాంకా గాంధీ వాధ్రా వాహనాన్ని ఒక ప్రైవేటు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు కొందరు అడ్డుకున్నారు. తాము పనిచేస్తున్న కంపెనీ గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనీ, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 8:07 am

న్యూఢిల్లీకి చేరుకున్న సీఐఏ డైరక్టర్ పనెట్టా

అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డైర్కటర్ లీయాన్ ఇ పనెట్టా శనివారం మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణతో భేటీ అయ్యారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 6:15 am

డిసెంబరు 4న వస్తోన్న మన్మథులు

యువ నిర్మాత వి. సురేష్ చౌదరి సూర్య పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న మన్మథులు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళంలో ఈ చిత్రం బిగ్ హిట్ సాధించింది. అందరూ మెచ్చే చిత్రంగా తెరకక్కిన ఈ సినిమాకు చాలా కాలం తర్వాత ఇళయరాజా సంగీతం అందించారు అని అన్నారు. అతిరూపన్, ప్రీతిరంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేలు రాజా
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 5:57 am

శ్వేతసౌధానికి విశిష్ట అతిథులుగా అభి-ఐష్!

అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చే ఆతిథ్యానికి టాప్-10 ప్రతినిధులను వైట్‌హౌస్ ప్రతినిధులు ఎంపిక చేశారు. వీరిలో భారత్ నుంచి ప్రధాని కాకుండా, ఐదుగురు ప్రముఖులకు చోటు దక్కింది. అలాగే, భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కూడా ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:52 am

చంద్రబాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్. జగన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ మాటమీద నిలబడే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని జగన్ ధ్వజమెత్రారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అడ్డాగుట్టలో జగన్ మాట్లాడుతూ.. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం అంశాల్లో చంద్రబాబు మాట తప్పారన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:51 am

మమత "మోహనం"గా బొడ్డు కింద టాట్టూ...

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలని భావించే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా.. తెలుగులో పొడవుకాళ్ల సుందరిగా పేరొందిన త్రిష టాట్టూ (పచ్చబొట్టు)ని ఎదపై వేయించుకుంటే.. కొందరు భాచితపైనా, మరికొందరు బొడ్డుపైనా వేసుకున్నారు. ఈ జాబితాలో మమతామోహన్‌దాస్ కూడా తాజాగా చేరింది. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం రమ్మీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ చిత్రంలో అందాలను ఆరబోసేందుకు మమతా పోటీ పడుతోందట. అంతేకాదు.. టాట్టూను బొడ్డుకింద వేయించుకుని గ్లామర్‌ను ప్రదర్శిస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందోనని వేచి చూడాల్సిందే.ముఖ్యంగా.. తెలుగులో నటించే హీరోయిన్ల మధ్య ఎక్కువగా పోటీ నెలకొనివుంది. దీంతో పదహారణాల తెలుగు ముద్దుగుమ్మలు సైతం పోటీ పడుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 5:47 am

వాణిజ్య వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన టాటా

వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ సంస్థ మూడు కొత్త వాణిజ్య వాహనాలను శుక్రవారం చండీగఢ్‌లోని మార్కెట్లో ప్రవేశ పెట్టింది. వీటిలో టాటా-407 పికప్, టాటా సూపర్ ఎస్, టాటా ఎస్ ఈఎక్స్ వాహనాలున్నాయి.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:30 am

ముఖ్యమంత్రిగా రోశయ్య... ఓ వేస్ట్ ఫెలో: చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించే అర్హతలు కొణిజేటి రోశయ్యకు ఏమాత్రం లేవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సీఎంగా ఓ వేస్ట్ ఫెలోతో సమానమని బాబు ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:27 am

మంత్రులూ... మీ పనితీరుపై నివేదిక ఇవ్వండి: ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గం సభ్యుల పనితీరుపై నివేదికను కోరారు. నవంబరు 30లోగా మంత్రులందరూ తమ పనితీరుపై తనకు నివేదికను సమర్పించాలని డెడ్‌లైన్ విధించారు. ప్రధాని తన క్యాబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ ద్వారా మంత్రులందరికీ ఈ మేరకు లేఖలు పంపించారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:14 am

మాపై వాషింగ్టన్ ఒత్తిడి లేదు: పాక్ మంత్రి ఖురేషీ

తమపై అగ్రదేశం అమెరికాతో పాటు.. మరే ఇతర దేశం ఒత్తిడి లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా ముహ్మద్ ఖరేషీ స్పష్టం చేశారు. అలాగే, కాశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వం, వేర్పాటు వాదుల మధ్య పాక్ జోక్యం లేకుండా జరిగే చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోవని ఆయన జోస్యం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 5:08 am

రూ.12.41 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ప్రభుత్వం

ఈ యేడాది సెప్టెంబరు నెలాఖరునాటికి 12.41 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే 2008 సంవత్సరంలో 25.79 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారేమ్ మీనా శుక్రవారం లోక్‌సభకు వివరించారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 4:53 am

గ్లోబల్ సమస్యగా రోడ్డు ప్రమాదాలు: బాన్ కీ మూన్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అభిప్రాయపడ్డారు. ఒకవిధంగా ఇది గ్లోబల్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదాల కారణంగా ప్రతియేడాది ఒక మిలియన్‌ మందికి పైగా ప్రజలు ప్రాణాలు దుర్మరణం పాలవుతున్నట్టు మూన్ చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2009 | 4:38 am

రాహుల్ పట్టించుకోలేదు... మీరైనా న్యాయం చేయండి

అమేథీలోని ముషింగంజ్ అతిథి గృహానికి వెళుతున్న ప్రియాంకా గాంధీ వాధ్రా వాహనాన్ని ఒక ప్రైవేటు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు కొందరు అడ్డుకున్నారు. తాము పనిచేస్తున్న కంపెనీ గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనీ, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 2:37 am

న్యూఢిల్లీకి చేరుకున్న సీఐఏ డైరక్టర్ పనెట్టా

అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డైర్కటర్ లీయాన్ ఇ పనెట్టా శనివారం మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణతో భేటీ అయ్యారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 12:46 am

చంద్రబాబుకు విశ్వసనీయత లేదు: వైఎస్. జగన్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, కానీ ఏనాడూ మాటమీద నిలబడే అలవాటు చంద్రబాబు నాయుడుకు లేదని జగన్ ధ్వజమెత్రారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అడ్డాగుట్టలో జగన్ మాట్లాడుతూ.. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం అంశాల్లో చంద్రబాబు మాట తప్పారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 12:22 am

ముఖ్యమంత్రిగా రోశయ్య... ఓ వేస్ట్ ఫెలో: చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించే అర్హతలు కొణిజేటి రోశయ్యకు ఏమాత్రం లేవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సీఎంగా ఓ వేస్ట్ ఫెలోతో సమానమని బాబు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 11:59 pm

మంత్రులూ... మీ పనితీరుపై నివేదిక ఇవ్వండి: ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గం సభ్యుల పనితీరుపై నివేదికను కోరారు. నవంబరు 30లోగా మంత్రులందరూ తమ పనితీరుపై తనకు నివేదికను సమర్పించాలని డెడ్‌లైన్ విధించారు. ప్రధాని తన క్యాబినెట్ కార్యదర్శి చంద్రశేఖర్ ద్వారా మంత్రులందరికీ ఈ మేరకు లేఖలు పంపించారు.
Source: జాతీయ | 20 Nov 2009 | 11:45 pm

రూ.12.41 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ప్రభుత్వం

ఈ యేడాది సెప్టెంబరు నెలాఖరునాటికి 12.41 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే 2008 సంవత్సరంలో 25.79 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారేమ్ మీనా శుక్రవారం లోక్‌సభకు వివరించారు.
Source: జాతీయ | 20 Nov 2009 | 11:24 pm

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం నేటితో పరిసమాప్తం!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలాంటి ప్రచారం చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 10:51 pm

గాలికి-చంద్రబాబుకు వ్యక్తిగత లింకు: లగడపాటి

ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ సంస్థ అధినేత గాని జనార్ధన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 10:37 pm

జార్ఖండ్‌లో సుస్థిరతకు పట్టం కట్టండి: సోనియా పిలుపు

జార్ఖండ్ రాష్ట్రంలో సుస్థిరత నెలకొనాలంటే... అభివృద్ధి రెట్టింపు వేగంతో సాగాలంటే తమ పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి.
Source: జాతీయ | 20 Nov 2009 | 9:27 pm

మావోయిస్టులు తీవ్రవాదులతో సమానం: జీకే.పిళ్లై

దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న మావోయిస్టులు తీవ్రవాదులతో సమానమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే.పిళ్లై అభిప్రాయపడ్డారు. అందువల్ల వారిపై తనకు ఎలాంటి సానుభూతి లేదని ఆయన తెగేసి చెప్పారు. ఆయన శుక్రవారం ఒరిస్సా ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు.
Source: జాతీయ | 20 Nov 2009 | 8:51 pm

భర్త నుంచి మీనా విడిపోతుందా...?

ఈ వార్త అవుననే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య లేదని చెబుతున్నాయి. ఆ మధ్య విద్యాసాగర్‌తో రిసెప్షన్‌లో విడివిడిగా ఉండటాన్ని చూసి అప్పట్లో బిజీగా ఉందని అనుకున్నారు. అయితే మీనా తిరిగి వెండితెరపై నటించాలన్న కోరికను వెలిబుచ్చినపుడు మొదట్లో అంగీకరించిన విద్యాసాగర్ ఇప్పుడు ససేమిరా అంటున్నాడట. దాంతో వారి మధ్య వాగ్వదాలు ఎక్కువయ్యాయనీ, త్వరలో విడాకులు తీసుకోవచ్చని చెబుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Nov 2009 | 9:31 am

హబ్బా... అన్నానంటే గ్రీన్ టీ వచ్చేస్తుంది: హాన్సిక

"దేశముదురు"తో ముందుకు వచ్చిన హాన్సిక తన బ్యాగ్‌లో ఏమున్నా లేకపోయినా అది లేకుండా బయటకు కాలు పెట్టదట. అదంటే ఏదో అనుకునేరు. అది గ్రీన్ టీ ప్యాకెట్ అట. అలసిపోయి హబ్బా అని అనిపిస్తే వెంటనే గ్రీన్ టీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ కప్పు లాగించేస్తుందట. అంతే... పరుగెత్తుకుంటూ ఒంట్లోకి హుషారు వచ్చేస్తుందట. అన్నట్లు హాన్సిక ఇంకా టీనేజ్‌ను దాటనేలేదట. ఇంత చిన్న వయసులోనే బాగా సంపాదించేస్తున్న హాన్సికను తన స్నేహితులు అంత డబ్బును ఎక్కడ దాస్తున్నావని అడిగితే అంతా అమ్మకే ఇస్తున్నాను అంటోంది. అమ్మ నాకు మార్గదర్శకమని చెపుతోంది. ఎన్ని గంటలకు నిద్రలేవాలి, టిఫిన్ ఎప్పుడు తినాలి. భోజనం ఎన్ని క్యాలరీలు ఉండాలి అనేవి తన తల్లే నిర్ణయిస్తుందని చెపుతోంది ఈ తెల్లపిల్ల. తను అలసటగా ఉన్నట్లు కనిపిస్తే తన తల్లి చిన్నప్పుడు గ్రీన్ టీ ఇచ్చేదనీ, ఇప్పుడు కూడా అలసట తీరేందుకు దానినే ఆశ్రయిస్తున్నాననీ చెపుతోంది. తాజాగా "సీతారాముల కల్యాణం లంకలో" చిత్రం షూటింగ్ గ్యాప్ లో కూడా గ్రీన్ టీని సిప్ చేస్తూ కనబడిందట. మొత్తానికి హాన్సిక ఎనర్జీ వెనుక గ్రీన్ టీ హస్తం ఉందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Nov 2009 | 7:16 am

భారత్‌లో రోజుకు ఐదు వేల మంది చిన్నారుల మృతి

దేశంలో రోజుకు ఐదువేల మంది చిన్నారులు మృతి చెందుతున్నట్టు అంతర్జాతీయ స్వచ్చంధ సంస్థ యునిసెఫ్ తాజాగా నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. నివారించలేని వ్యాధులే ఇందుకో ప్రధాన కారణమని ఆ నివేదిక తేల్చింది.
Source: జాతీయ | 20 Nov 2009 | 5:51 am

డిసెంబరు 19న పులివెందులు ఉప ఎన్నిక పోలింగ్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పులివెందుల నియోజకవర్గానికి డిసెంబరు 19వ తేదీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ సెగ్మెంట్‌తో పాటు తమిళనాడు, మణిపాల్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా అదే రోజున పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఢిల్లీలో ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 5:51 am

"యువరాజు"తో జతకట్టనున్న సానియా మీర్జా!

భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆటతోనే కాకుండా గ్లామర్‌తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోన్న సానియా మీర్జాపై టాలీవుడ్ నిర్మాతలు కన్నేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సానియా మీర్జా నటిస్తుందని "శివాజీ" షూటింగ్ సమయంలోనే వార్తలు షికార్లు చేశాయి. కానీ సానియా మీర్జా ఆడపాదడపా ప్రకటనలకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుతో సానియా నటిస్తోంది. కానీ.. ఇదేదో సినిమా అనుకుంటే మాత్రం పప్పులో కాలిసినట్టే..!. ఓ ఎయిర్‌సెల్ కంపెనీకి తమిళంలో సూర్య. జాతీయ స్థాయిలో ధోనీ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆ అవకాశం తెలుగులో మహేష్ బాబుకు, సానియాకు లభించిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ జంట ఈ ప్రకటన ద్వారా ప్రేక్షకులను, అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 20 Nov 2009 | 4:15 am

దేవుడు కరుణిస్తాడు.. అపుడు సీఎంనవుతా: జగన్

తన పట్ల, తన కుటుంబం పట్ల ఏదో ఒక రోజున దేవుడు కరుణ చూపుతాడని.. ఆ రోజున మీ అందరి ఆశీర్వాదవచనాలు ఫలించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపడుతానని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 3:36 am

రాష్ట్రంలో రోశయ్యది ధృతరాష్ట్ర పాలన: టీడీపీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యది ధృతరాష్ట్ర పాలన అని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో అక్రమాలు పెచ్చరిల్లిపోతున్న ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెదేపా ఆరోపించింది. ఓబుళాపురం గనుల అక్రమాలు, బ్రాహ్మణీ స్టీల్ కర్మాగారానికి, మైలవరం రిజర్వాయర్ ద్వారా అక్రమంగా రెండు టీఎంసీల నీటి కేటాయింపుల గురించి ప్రభుత్వానికి అన్నీ తెలిసినా వాటిపై చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి దుమ్మెత్తిపోశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 3:28 am

రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి: వీహెచ్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ యువనేతలు నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హితవు పలికారు. తనను భావి ప్రధానిగా చూడవద్దని వినయంగా ప్రకటించిన రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువనాయకులకు ఆదర్శప్రాయుడిగా మారారని వీహెచ్ ప్రశంసించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనానికి ఆదర్శమని కొనియాడారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 3:17 am

పార్లమెంట్‍‌లో చెరకు దడ: రెండు రోజుల వాయిదా!

చెరకు మద్దతు ధరపై పార్లమెంట్ మరోమారు దద్ధరిల్లింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు సమావేశమైన పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు చెరకు మద్దతు ధరపై పట్టుబట్టాయి.
Source: జాతీయ | 20 Nov 2009 | 3:13 am

సౌమ్యకే నాథుడు, ప్రశాంత స్వరూపుడు "సౌమ్యనాథుడు"

నారద మహర్షిచే ప్రతిష్టించబడి.. సంతాన సౌమ్యనాథుడిగా, వీసాల సౌమ్యనాథుడిగా, కలియుగ దైవంగా విరాజిల్లుతున్న సౌమ్యనాథ స్వామి కడప జిల్లాలోని నందలూరులో వెలిశాడు. ఒక్కసారి దర్శిస్తేనే కలలో దర్శనమిచ్చే సౌమ్యనాథుడు.. కోరిక కోర్కెలు తీర్చే దైవంగా, ఇంటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.
Source: వినోదం | 20 Nov 2009 | 2:52 am