ఏటీఎఫ్ ధరల పెంపు, ఛార్జీలు పెరిగే అవకాశం?

కొండ నాలుకకు మందు వేసుకోబోయి.. ఉన్న నాలుక ఊడిందట.. సామెత కొంచెం మారినా.. వినే ఉంటారు. ఇప్పటికే విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరిగిపోయాయి.. తగ్గించండి బాబోయ్... అంటూ విమానయాన సంస్థలు మొత్తుకుంటుంటే.. ఇవేవీ పట్టనట్లు.. మళ్లీ ఇంధన ధరలు పెరిగిపోయాయి.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 9:43 am

ఎగుమతుల్లో రికవరీ సంకేతాలు: ఆర్థిక శాఖ

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో జూన్ నెలలోను ఎగుమతుల్లో క్షీణత నమోదయింది. కానీ విదేశీ విక్రయాల్లో ముందుగానే రికవరీ కనబడుతుండటంతో.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఎగుమతుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 8:54 am

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో బ్రిటన్ సైనికుడి మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడులో గాయపడిన ఓ బ్రిటన్ సైనికుడు శనివారం మృతి చెందాడు. దీంతో ఇప్పటివరకు ఆప్ఘనిసస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతూ మృతి చెందిన మొత్తం బ్రిటన్ సైనికుల సంఖ్య 200కి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 7:58 am

జిన్నాను భారత్ భూతంగా చూసింది: జస్వంత్

పాకిస్థాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నాను భారత్ భూతంలాగా చూసిందని బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు కేంద్రీకృత వ్యవస్థపై ఉన్న ప్రగాఢ నమ్మకం వలనే స్వాతంత్ర్యానంతరం భారత ఉపఖండం ఇండియా, పాకిస్థాన్‌లుగా విభజించబడిందని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 7:26 am

సెప్టెంబర్‌లో జీ-20 ఆర్థిక మంత్రుల సదస్సు

ఓ నెల తర్వాత అమెరికాలో పిట్స్‌బర్గ్ సదస్సు కోసం ప్రణాళిక చేయడానికి సెప్టెంబర్ 4 మరియు 5వ తేదీల్లో లండన్‌లో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రులతో సహా కేంద్ర బ్యాంకు గవర్నర్లు కూడా హాజరవుతారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 7:26 am

రాజధానిలో అనుమానాస్పద స్వైన్ ఫ్లూ మృతి

ప్రమాదకర స్వైన్ ఫ్లూతో ఓ వ్యక్తి రాష్ట్ర రాజధానిలో మృతి చెందినట్లు మరోసారి వదంతులు వ్యాపించాయి. రెండు రోజుల క్రితం కూడా ఇటువంటి వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించాడని వదంతులు వ్యాపించడంతో పౌరులు ఉలిక్కిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 6:44 am

టైం వస్తే అన్నీ చెబుతా: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు మెదక్ తనపై చేస్తున్న విమర్శలపై స్పందించేందుకు మెదక్ ఎంపీ విజయశాంతి నిరాకరించారు. టీఆర్ఎస్ నేతలు తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడంపై ఆమె మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడుడూ అన్నీ వివరంగా చెబుతానన్నారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 6:23 am

నంద్యాల వస్తున్న బౌద్ధ గురువు దలైలామా

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని సూర్యనంది క్షేత్రానికి బౌద్ధుల ఆథ్యాత్మిక గురువు దలైలామా రానున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఆయన నంద్యాల వస్తారు. ఈ ప్రాంతంలో బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తున్న ఏడేళ్ల చిన్నారి శాంభవిని కూడా ఆయన కలుస్తారు.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 6:14 am

చైనా దృష్టిలో జైషే చీఫ్ మసూద్ తీవ్రవాది కాదు

భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మౌలానా అజహర్‌ను తీవ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను చైనా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేత జైషే మొహమ్మద్‌ను తీవ్రవాద సంస్థగా, దాని అధిపతిని తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించింది.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 6:04 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 15,280 - రూ. 15,000, వెండి కిలో - రూ. 23,400 - రూ. 23,200. చెన్నై 24 క్యారెట్ - రూ. 14,970 - రూ. 14,895, వెండి కిలో - రూ. 25,030 - రూ. 24,215. విజయవాడ - రూ. 15,100 - రూ. 15,030, వెండి కిలో - రూ. 23,800 - రూ. 23,600.
Source: Yahoo! Telugu: News | 16 Aug 2009 | 5:46 am

జిన్నాను భారత్ భూతంగా చూసింది: జస్వంత్

పాకిస్థాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నాను భారత్ భూతంలాగా చూసిందని బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు కేంద్రీకృత వ్యవస్థపై ఉన్న ప్రగాఢ నమ్మకం వలనే స్వాతంత్ర్యానంతరం భారత ఉపఖండం ఇండియా, పాకిస్థాన్‌లుగా విభజించబడిందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 16 Aug 2009 | 1:57 am

రాజధానిలో అనుమానాస్పద స్వైన్ ఫ్లూ మృతి

ప్రమాదకర స్వైన్ ఫ్లూతో ఓ వ్యక్తి రాష్ట్ర రాజధానిలో మృతి చెందినట్లు మరోసారి వదంతులు వ్యాపించాయి. రెండు రోజుల క్రితం కూడా ఇటువంటి వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించాడని వదంతులు వ్యాపించడంతో పౌరులు ఉలిక్కిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 1:14 am

టైం వస్తే అన్నీ చెబుతా: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు మెదక్ తనపై చేస్తున్న విమర్శలపై స్పందించేందుకు మెదక్ ఎంపీ విజయశాంతి నిరాకరించారు. టీఆర్ఎస్ నేతలు తనను తెలంగాణ ద్రోహిగా అభివర్ణించడంపై ఆమె మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడుడూ అన్నీ వివరంగా చెబుతానన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 12:53 am

నంద్యాల వస్తున్న బౌద్ధ గురువు దలైలామా

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని సూర్యనంది క్షేత్రానికి బౌద్ధుల ఆథ్యాత్మిక గురువు దలైలామా రానున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఆయన నంద్యాల వస్తారు. ఈ ప్రాంతంలో బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తున్న ఏడేళ్ల చిన్నారి శాంభవిని కూడా ఆయన కలుస్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Aug 2009 | 12:44 am

నిర్బంధం దురదృష్టకరం: బాలీవుడ్ బాద్‌షా

అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న నెవార్క్ విమానాశ్రయంలో తనను రెండు గంటలు నిర్బంధించడాన్ని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ దురదృష్టకరంగా వర్ణించారు. అమెరికా అధికారిక యంత్రాంగం చేతిలో జరిగిన అవమానంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ.. రెండు గంటలపాటు తనను ప్రశ్నించడంపై తాను క్షమాపణేమీ కోరనన్నారు.
Source: జాతీయ | 16 Aug 2009 | 12:07 am

భారత్ భవితకు రెండవ హరిత విప్లవం: ప్రధాని

భారత్ భవితకు రెండవ హరిత విప్లవం ఎంతైనా అవసరం ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. వర్షాభావంతో పంటలపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని మన్మోహన్ తెలిపారు.
Source: జాతీయ | 15 Aug 2009 | 9:11 pm

గౌతమ్‌ మీనన్‌తో "జోష్" రెండో సినిమా!

"ఘర్షణ" సినిమా దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వ సారథ్యంలో.. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు, "జోష్" హీరో నాగచైతన్య నటించనున్నాడు. ఇప్పటికే "జోష్" సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాధా కుమార్తె కార్తీకతో జతకట్టిన నాగచైతన్య త్వరలో అద్భుతమైన ప్రేమకథతో తెరపైకి రానున్నాడు. నాగచైతన్య హీరోగా, ఇందిరా ప్రొడక్షన్స్‌పై సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, కావ్యాస్ డైరీ ఫేమ్ మంజుల నిర్మాణ సారథ్యంలో, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే కొత్త సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Aug 2009 | 10:09 am

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో "యంగ్‌టైగర్ ఎన్టీఆర్" కొత్త చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. "మున్నా" చిత్ర దర్శకుడు పైడిపల్లి వంశీ డైరక్షన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ఆరంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Aug 2009 | 9:41 am

జాతీయ జెండాను తగులబెట్టారు...!

యావత్ భారతదేశం శనివారంనాడు 63వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు హైదరాబాద్‌లో మన దేశ జాతీయ పతాకాన్ని తగులబెట్టి జాతి గౌరవాన్ని, స్ఫూర్తిని మంటగలిపారు.
Source: ఏపీ న్యూస్ | 15 Aug 2009 | 7:35 am

అండమాన్ నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు

అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం గం. 1. 10లకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూ ప్రకంపనలు 5.3గా నమోదైనట్లు భూగర్భ పరిశోధనాశాఖాధికారులు తెలిపారు.
Source: జాతీయ | 15 Aug 2009 | 5:49 am

ముఖ్యమంత్రితో భేటీ అయిన రాములమ్మ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో మెదక్ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నాయకురాలు విజయశాంతి శనివారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో విజయశాంతి ముఖ్యమంత్రిని కలిశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Aug 2009 | 5:32 am

రజియాను పరామర్శించిన ఎమ్మెల్యే

గుంటూరుజిల్లా పొన్నూరు టౌన్‌ ఎస్‌ఐ రంగనాధ్ గౌడ్ చేతిలో మోసగించబడిన రజియా సుల్తానాను పొన్నూరు ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Aug 2009 | 5:31 am

దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారతదేశ స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక కట్టడమైన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శనివారం ఉదయం ఎగురవేశారు.
Source: జాతీయ | 15 Aug 2009 | 5:31 am

రాజస్థాన్ బీజేపీలో ముసలం

రాజస్థాన్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో ఆ పార్టీలో చీలికలు ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను విపక్ష నేతగా తొలగించిన పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమె రాజీనామా చేయాలని ఆయన పట్టుపడుతున్నారు.
Source: జాతీయ | 15 Aug 2009 | 5:30 am

తెదేపాలో చేరిన తమ్మినేని

మాజీ మంత్రి తమ్మినేని సీతారాం శనివారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
Source: ఏపీ న్యూస్ | 15 Aug 2009 | 4:57 am