గోర్ష్‌కోవ్ ధరను సమర్థించిన సురేష్ మెహతా

రష్యా నుంచి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అనే విమానవాహక నౌకను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ భారీ మొత్తం చెల్లించడాన్ని నావికా దళ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా గురువారం సమర్థించారు. గోర్ష్‌కోవ్ నౌకను కొనుగోలు చేసేందుకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడంపై కాగ్ ఇటీవల అంక్షితలు వేసిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 10:24 am

స్విస్ బ్యాంకుల్లో ధనాన్ని వెనక్కు రప్పిస్తాం

స్విస్ బ్యాంకుల్లో దాచివున్న భారతీయుల ధనాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల ధనాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి గురువారం రాజ్యసభకు తెలియజేశారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 9:45 am

విడుదలైన జనశక్తి నేత అమర్‌

చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్న జనశక్తి నేత అమర్‌ గురువారం విడుదలయ్యారు. జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అమర్‌ పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ చర్లప్లలి జైల్లో ఉన్నారు. ఈయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు కావడంతో విడుదలయ్యారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 9:40 am

లాభాల్లో సెన్సెక్స్: ఐటీ స్టాకుల వృద్ధి

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 204 పాయింట్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 5,377 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 4,575 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.34 శాతం, నిఫ్టీ 1.36 శాతం మేరకు వృద్ధి చెందింది. ఇప్పటి వరకు మొత్తం 2,704 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,429 కంపెనీల వాటాలు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 9:35 am

లాభాల్లోనే కొనసాగుతున్న సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 106 పాయింట్లు పుంజుకుని 15,280 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 4,541 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.70 శాతం, నిఫ్టీ 0.62 శాతం మేరకు లాభపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 9:07 am

కుదిరిన మైక్రోసాఫ్ట్, యాహూల ఒప్పందం

ఇంటర్నెట్ ప్రపంచంలో అగ్రగామిగానున్న గూగుల్ గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ్గజాలైన సాఫ్ట్‌వేర్ కంపెనీ మరియు యాహూల మధ్య 10సంవత్సరాలపాటు దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 9:03 am

మసీదుపై నైజీరియా సైనికుల దాడి

నైజీరియా సైనికులు మసీదుపై దాడి చేయడంతో అనేక మృతి చెందారు. దేశాధ్యక్షుడి ఆదేశాలపై నైజీరియా సైన్యం గత కొంతకాలంగా ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడుతోంది. నైజీరియా తాలిబాన్లుగా వ్యవహరించబడుతున్న సాయుధ వర్గాన్ని అణిచివేసేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే 300 మందికిపైగా మృతి చెందారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 8:56 am

లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 118 పాయింట్లు పుంజుకుని 15,292 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 4,541 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.78 శాతం, నిఫ్టీ 0.61 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 8:25 am

టాలీవుడ్‌లో "మగధీర" మానియా... చూడండి ట్రెయిలర్

మెగాస్టార్ తనయుడు, చిరుత హీరో రామ్‌చరణ్ తేజ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం "మగధీర" శుక్రవారం (31వ తేదీ) తెరపైకి రానుంది. "చందమామ" ఫేమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించారు. గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 8:09 am

ఆగస్టులో ఫియెస్టా ఎస్ఎక్స్ఐ విడుదల: ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా ఫియెస్టా ఎస్ఎక్స్ఐని ఆగస్టు 3న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో ఫియెస్టా ఎస్ఎక్స్ఐని క్రోమ్ మరియు సిల్వర్ రంగులలో విడుదల చేయనున్నట్లు కంపెనీ కార్యనిర్వాహక డైరెక్టర్ నిగేల్ వార్క్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 7:59 am

దావూద్ అప్పగింతపై సహకరించని పాక్: ఎస్ఎం.కృష్ణ

అండవర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంను అప్పగించే అంశంపై దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం సహకరించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపారు. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2009 | 7:47 am

త్వరలో తెరపైకి "కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య"

గుర్లిన్ చోప్రా, ఆళ్ళ రాంబాబు జంటగా శ్రీ రాజ్యలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య". ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఆళ్ళ బ్రదర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి భరత్‌పారేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత, హీరో ఆళ్ళ రాంబాబు మాట్లాడుతూ.. సెన్సార్‌ను పూర్తి చేసుకుని త్వరలో తొలికాపీ సిద్ధం కానుందన్నారు. లలిత్ సురేష్ సంగీతం సమకూర్చిన ఆడియోను ఈ వారంలో విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. లండన్‌కు చెందిన మానసిక వైద్యుడు మాదిన రామకృష్ణ ఇందులో విలన్‌గా నటించారని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 5:58 am

హరీష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ కొత్త చిత్రం!

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కథానాయకుడుగా, యువ దర్శకుడు హరీష్‌శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై నటుడు గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 5:37 am

'గజరాజు' ఆగ్రహం: 'అభి-ఐష్'లకు తప్పిన ప్రమాదం

బాలీవుడ్ హీరో హీరోయిన్లు ఐశ్వర్యారాయ్, అభిషేక్‌ బచ్చన్‌లకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ "రావణ్" అనే చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కేరళ రాష్ట్రంలోని త్రిచూర్‌లో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 5:28 am

"కౌష" హాట్ అండ్ సెక్సీ వీడియో.. రిలీజ్..!

నటీమణుల అందచందాలకు సంబంధించి హాట్ వీడియోలు అప్పుడప్పుడు మార్కెట్లలో షికార్లు చేస్తుంటాయి. తాజాగా నటిగా రంగప్రవేశం చేసి ఐటంసాంగ్‌లు చేస్తున్న కౌష ఇటీవలే ఒక వీడియో ద్వారా కనువిందు చేసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కౌషని వెనక్కి లాగుతున్నట్లు, మరో ఇద్దరు ముద్దులు పెడుతున్నట్లు, మరో ఇద్దరు ఆమె అందాల్ని తడుముతున్నట్లు కన్పించారు. ఆ తర్వాత నడిపిన అసలు వ్యవహారం కనీకనిపించనట్లు ఉంది. ఇది మార్ఫింగ్‌ వీడియోకాదనీ, కౌష నిజంగానే ఈ వీడియోలో పాల్గొందని ఫిలింనగర్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2009 | 5:13 am

గోర్ష్‌కోవ్ ధరను సమర్థించిన సురేష్ మెహతా

రష్యా నుంచి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అనే విమానవాహక నౌకను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ భారీ మొత్తం చెల్లించడాన్ని నావికా దళ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా గురువారం సమర్థించారు. గోర్ష్‌కోవ్ నౌకను కొనుగోలు చేసేందుకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడంపై కాగ్ ఇటీవల అంక్షితలు వేసిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 30 Jul 2009 | 4:55 am

స్విస్ బ్యాంకుల్లో ధనాన్ని వెనక్కు రప్పిస్తాం

స్విస్ బ్యాంకుల్లో దాచివున్న భారతీయుల ధనాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల ధనాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి గురువారం రాజ్యసభకు తెలియజేశారు.
Source: జాతీయ | 30 Jul 2009 | 4:15 am

విడుదలైన జనశక్తి నేత అమర్‌

చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్న జనశక్తి నేత అమర్‌ గురువారం విడుదలయ్యారు. జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అమర్‌ పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ చర్లప్లలి జైల్లో ఉన్నారు. ఈయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు కావడంతో విడుదలయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 4:11 am

దావూద్ అప్పగింతపై సహకరించని పాక్: ఎస్ఎం.కృష్ణ

అండవర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంను అప్పగించే అంశంపై దాయాది దేశం పాకిస్థాన్ ఏమాత్రం సహకరించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపారు. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 30 Jul 2009 | 2:18 am

రోశయ్య, స్పీకర్‌లకు ముఖ్యమంత్రి అభినందన

ప్రతిపక్ష సభ్యుల పట్ల కఠినంగా వ్యవహించిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి కె.రోశయ్య, స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభినందించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 1:06 am

గ్రేటర్‌ ఎన్నికలపై సుప్రీంకు వెళ్లనున్న ప్రభుత్వం!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించే విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఈ ఎన్నికల నిర్వాహణపై దాఖలైన పలు పిటీషన్ల ప్రొసీడింగ్స్‌ను, ఎన్నికల నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2009 | 12:45 am

సంయుక్త ప్రకటనపై ప్రధానికి అండగా సోనియా

ఇండో-పాకిస్థాన్ సంయుక్త ప్రకటనపై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేంత వరకు పాక్‌తో ఎలాంటి చర్చలకు తావులేదని ప్రధాని చేసిన స్పష్టమైన ప్రకటనకు సోనియా మద్దతు పలికారు.
Source: జాతీయ | 30 Jul 2009 | 12:20 am

"గాలి"కి క్షమాపణలు చెప్పిన మంత్రి రోశయ్య

రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడిని దుర్భాషలాడిన రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 11:46 pm

అవినీతి ఆరోపణలు: ఏఐసీటీఈ ఛైర్మన్ సస్పెండ్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఛైర్మన్ ఆర్ఏ యాదవ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసుపై జరిగే సీబీఐ దర్యాప్తు ప్రభావితం కాకుండా చూసేందుకు ఆర్ఏ యాదవ్‌ను పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Source: జాతీయ | 29 Jul 2009 | 10:23 pm

అమెరికాతో ఒప్పందాన్ని సమర్థించిన ప్రధాని

అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కుదిరిన తుది వినియోగ పర్యవేక్షణా ఒప్పందాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమర్థించారు. అమెరికాతో కుదుర్చుకున్న ఈ ద్వైపాక్షిక తుది వినియోగ పర్యవేక్షణ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుందని ప్రధాని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 9:53 pm

కత్రినా వదిలేసిందిగా.. నేను ప్రేమిస్తా... రా!!

బాలీవుడ్ బాంబ్ షెల్ మినిష్షా లాంబా సల్మాన్ అనుమతిస్తే అతడిని ప్రేమలోకంలో ముంచెత్తుతానని అంటోందట. ఎలాగూ కత్రినా కైఫ్ ఎడముఖం అయింది కనుక, సల్మాన్ "ఊ..." అంటే అతడిని ప్రేమలోకంలో ఓలలాడిస్తానని చెపుతోందట. కాదనుకున్నవారిని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకునేకంటే, అవునంటున్న తనలాంటి వారితో స్నేహం చేస్తే మనసు మళ్లీ పునరుత్తేజాన్ని సంతరించుకుంటుందని పెద్ద పెద్ద డైలాగులు చెపుతోందట. తన మనసులో ఇప్పటివరకూ ఏ మగాడు లేడనీ, అయితే ఇటీవల కాలంలో సల్మాన్ గురించి థింక్ చేసినప్పుడు అతడిని ప్రేమించాలనిపించిందని మినిష్షా తన మనసులోని మాట చెప్పిందట. అలాగే సల్మాన్‌తో నటించాలని ఎప్పటి నుంచో కలగంటున్నానీ, ఆ కల నెరవేరుతుందని ఆశపడుతున్నట్లు చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 11:22 am

ఇండో-చైనాల మధ్య హాట్‌లైన్

ఇండో-చైనాల మధ్య అత్యున్నతస్థాయిలో సమావేశాలు, సంప్రదింపులు జరిపేందుకు హాట్‌లైన్ ఉండాలని చైనాదేశం ప్రతిపాదించినట్లు భారత ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.
Source: జాతీయ | 29 Jul 2009 | 9:37 am

విమానయాన సంస్థలు దేశీయ చట్టాలను గౌరవించాలి: పటేల్

విమానయాన సంస్థలన్నీకూడా భారతదేశానికి చెందిన చట్టాలు, నియమనిబంధనలకు లోబడే అందులో ప్రయాణించే ప్రయాణీకులను తనిఖీలు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ తెలిపారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 9:04 am

"ఆది", "ఖుషీ" విలన్ రాజన్ పి.దేవ్ కన్నుమూత

ఆది, ఖుషీ తదితర తెలుగు చిత్రాల్లో నటించి మేటి విలన్ అనిపించుకున్న మలయాళ నటుడు రాజన్ పి.దేవ్(58) బుధవారం కన్నుమూశారు. లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ బుధవారం కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 7:29 am

తిరిగిరాని లోకాలకు రాజమాత గాయత్రీదేవి

ఈ యుగవు అందాలరాణి, జైపూర్ రాజమాత, మహారాణి గాయత్రీదేవి బుధవారం కన్నుమూశారు. ఆమెకు వయస్సు 90 సంవత్సరాలు. గత వారం రోజులుగా ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమె.. జైపూర్‌లోని సంతోక్భా దుర్లాబ్జీ మెమోరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 6:58 am

విదేశాంగ విధానంపై ఎన్డీయే పాఠాలు మాకొద్దు: ప్రధాని

విదేశాంగ విధానం గురించి ప్రతిపక్షం ఎన్డీయే కూటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ఘాటుగా స్పందించారు. ముంబై దాడుల్లో పాక్ దేశీయుల హస్తం ఉన్నట్టు ఆ దేశం అంగీకరించడమే యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయమని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 29 Jul 2009 | 6:57 am

కడప దర్గాలో "మగధీర" ప్రత్యేక ప్రార్థనలు

కడప జిల్లా కేంద్రంలో ఉన్న అమీన్‌పీర్ దర్గాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ బుధవారం దర్శించుకున్నారు. తాను కొత్తగా నటించిన 'మగధీర' ఈనెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం హిట్ కావాలని కోరుతూ రామ్ చరణ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 6:51 am

మళ్లీ.. అహనా పెళ్లంట!

రాజేంద్రప్రసాద్‌ హీరోగా గతంలో వచ్చిన 'అహనా పెళ్లంట' చిత్రం అప్పట్లో ప్రేక్షకులను హాస్యపు జల్లులో ముంచెత్తిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడా చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశేషమేమంటే.. ఈ కొత్త వర్షన్‌లో హీరోగా అల్లరి నరేష్‌ పేరు విన్పిస్తోంది. ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్న "అహనా పెళ్లంట" చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో ప్రత్యేకత ఏమంటే... అందులో నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ కొత్త చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నాడట. మొత్తానికి రాజేంద్రప్రసాద్‌ చిత్రాలన్నీ నరేష్‌కు క్రేజ్‌ తెచ్చిపెడుతున్నాయన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 5:30 am

దాసరి డబ్బు... సన్నిహితుడు గుటకాయ స్వాహా

దాసరి నారాయణరావును మోసం చేయడమా? ఎన్ని గుండెలుండాలి అనిపించవచ్చు. అది బయటివ్యక్తికి. ఆయనతో అతి సన్నిహితుడికి అదేమంత కష్టం కాదు కదా. దాసరి బోళా మనిషంటారు. మహాముదురు అని మరోవర్గం చెబుతుంటారు. దాసరికంటే.. ఆయన చుట్టూ చేరిన కొందరు బాగా సంపాదించారని కూడా అనుకుంటారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో దాసరికి పెద్దమొత్తంలో డబ్బు రావలసి ఉంది. ఆ డబ్బును దాసరి పంపించారంటూ దాసరి సన్నిహితులొకరు ఢిల్లీ వెళ్ళి.. అప్పటికే దాసరి సంతకం చేసిన కొన్ని కాగితాలు ఇచ్చి ఆ పెద్ద ఎమౌంట్‌‌ను తీసేసుకున్నాడట. ఈ విషయం తెలీని దాసరి కొన్ని రోజుల తర్వాత తనకు రావాల్సిన సొమ్ము గురించి ఢిల్లీలో ఉన్న వ్యక్తిని అడిగినప్పుడు.. అసలు కథ బయటపడిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2009 | 5:19 am

'గాలి' మాటలు మాట్లాడడం బాబు నైజం: కాంగ్రెస్

తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సభా సమయాన్ని వృధా చేసేందుకు సభలో తన పార్టీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న బాబు.. ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సరైన చర్య కాదని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 5:15 am

రోశయ్య వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: తెదేపా

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన కార్యకలాపాల్లో తమ పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడును ఉద్దేశించి మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 5:06 am

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సభాపతి: చంద్రబాబు

సభా వ్యహారాలను పరిరక్షించి, అన్ని పార్టీల సభ్యులను సమానంగా చూడాల్సిన సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారిపట్ల ఆయన వకల్తా పుచ్చుకున్నట్టుగా ఉన్నారని బాబు మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 29 Jul 2009 | 4:47 am