కొత్తదనంలేని రాష్ట్రపతి ప్రసంగం: భాజపా

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేసిన ప్రసంగంలో ఎలాంటి కొత్త అంశాలు చోటు చేసుకోలేదని, ఈ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 7:04 pm

మహిళా బిల్లుకు శివసేన-జేడీయు వ్యతిరేకం!

దేశ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలైన శివసేన, జనతాదళ్ యు పార్టీలు వ్యతిరేకించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీలకు చెందిన నేతలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 5:56 pm

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌లో పోలీసులు గురువారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడైనా తీవ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ భద్రతా చర్యలు చేపట్టడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 5:53 pm

15వేల మార్కుకు పైన ముగిసిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ 15వేల మార్కుకు పైన ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 15,009 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 4,573 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.93 శాతం, నిఫ్టీ 0.93 శాతం చొప్పున వృద్ధి చెందాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో ఈ రోజు ఉదయం 116 పాయింట్లు నష్టంతో 14,755 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 5:33 pm

కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏమిటి?

ఒక సమాచారాన్ని ఏవరికీ అంతుచిక్కకుండా ఇతరులకు చేరవేయాలంటే ప్రస్తుతం మానవాళిలో ఉన్న ఏదో ఒక భాషను ఉపయోగించాలి. ఈ భాషకు స్వల్ప మార్పులు చేసి, ఆ మార్పులకు అనుగుణంగా భాషను కనిపెట్టడమే కోడింగ్ అంటారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 5:13 pm

ఏజిస్ బీపీవోలో 12 వేల కొత్త ఉద్యోగాలు

ఎస్సార్ గ్రూపుకు చెందిన బీపీవో సంస్థ ఏజిస్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 12 వేల కొత్త ఉద్యోగాలు కల్పించనుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఏజిస్ లిమిటెడ్ ఉద్యోగుల సంఖ్య 43 వేలకు చేరుతుంది. ప్రతి నెలలోనూ వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో అపరూప్ సేన్‌గుప్తా వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 5:08 pm

బికినీకైనా.. రాక్షసికైనా రెడీ: "శూర్పణఖ" ప్రియమణి

రామాయణంలో లంకాధీశుని చెల్లెలు శూర్పణఖ తెలుసు కదా. ఇప్పుడా పాత్రలో టాలీవుడ్ బికినీ భామ ప్రియమణి నటించడానికి రెడీ అందిట. రాక్షసిలా నటిస్తావా...? అని అడిగినవాళ్లతో పోజుగొట్టి మరీ సమాధానాలు చెపుతోందట. రాక్షసిగా చేయాలన్నా, బికినీ భామగా నటించాలన్నా, మట్టిగొట్టుకుని మురికి పిల్లగా కనిపించాలన్నా తనకే సాధ్యమని గొప్పలు పోతోందట. అన్నట్లు చెప్పడం మరిచాను... బికినీ ప్రియమణి ఈ పాత్రను మణిరత్నం "రావణ" చిత్రంకోసం చేస్తోందట. ఈ చిత్రంలో శ్రీరామునిగా "అపరిచితుడు" విక్రమ్ నటిస్తుండగా, రావణుడుగా వెండితెర సీత(ఐశ్వర్యారాయ్) భర్త అభిషేక్ నటిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2009 | 5:02 pm

ఇగ్నోలో డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్

ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్ డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రాముల్లో ఓపెన్ మ్యాట్ ద్వారా ప్రవేశానికి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (డీఐఎం), పీజీ
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 4:55 pm

పనితీరుతోనే సమాధానం చెప్తా: స్పీకర్

ప్రతిపక్షాలకు తనపై ఉన్న అభ్యంతరాలకు తన పనితీరుతోనే సమాధానం చెబుతానని అసెంబ్లీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అదేసమయంలో సభ సమావేశం సమయంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కలగజేస్తానని ఈ విషయంలో మహిళలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 4:53 pm

రేపు ఎంసెట్ అభ్యర్థులకు వర్క్‌షాపు

ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుక్రవారం వర్క్‌షాపు జరుగనుంది. కాకినాడలో జరిగే ఈ వర్క్‌షాపును ది హిందు ఎడ్యుకేషన్ ప్లస్, కేఎల్.విశ్వవిద్యాలయం సంయుక్తంగా రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 4:44 pm

విద్యార్థులు, ఉపాధ్యాయులను విడిచిపెట్టిన తాలిబాన్లు

పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతున్న కాడెట్ కళాశాల నుంచి కిడ్నాప్ చేసిన కొందరు విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్ తీవ్రవాదులు గురువారం వదిలిపెట్టారు. పాక్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతంలో ఇటీవల కాడెట్ కళాశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను తాలిబాన్లు కిడ్నాప్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2009 | 4:44 pm

కొత్తదనంలేని రాష్ట్రపతి ప్రసంగం: భాజపా

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేసిన ప్రసంగంలో ఎలాంటి కొత్త అంశాలు చోటు చేసుకోలేదని, ఈ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 4 Jun 2009 | 1:35 pm

కొత్త బాయ్‌ఫ్రెండ్ అన్వేషణలో నయన

ఒకటికి రెండు సార్లు ప్రేమలో పడి, వివాదాల్లో చిక్కుకున్న మలయాళ కుట్టి నయనతార మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ అన్వేషణలో పడినట్టు చెన్నై కోడంబాక్కం వర్గాలు చెపుతున్నాయి. ఈ వార్త తమిళ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2009 | 1:12 pm

మహిళా బిల్లుకు శివసేన-జేడీయు వ్యతిరేకం!

దేశ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలైన శివసేన, జనతాదళ్ యు పార్టీలు వ్యతిరేకించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీలకు చెందిన నేతలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.
Source: జాతీయ | 4 Jun 2009 | 12:27 pm

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌లో పోలీసులు గురువారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడైనా తీవ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ భద్రతా చర్యలు చేపట్టడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 12:24 pm

ఇంట్లో కురుచ దుస్తుల్లోనే ఉంటా: శ్రద్ధా దాస్

"అధినేత"లో తన గ్లామర్ అందాలను ప్రదర్శించిన శ్రద్ధాదాస్ ఇకనుంచి నటనకు అవకాశం గల పాత్రలనే వేస్తానని పాత చింతకాయ పచ్చడి మాటలనే చెపుతోంది. ఆర్య-2లో చేయబోయే పాత్ర అటువంటిదే అంటోంది. ఇంట్లో ఉన్నప్పుడు కురచ దుస్తులు ధరించి తిరిగే అలవాటు తనకు ఉందని బహిరంగంగానే చెపుతోందట. కురచ అంటే ఎంత కురచా అని మన పిల్ల జర్నలిస్టు అడిగేలోపు, "అధినేత"లో ఓ సీన్‌లో ధరించిన వస్త్రాల సైజువని చెప్పేసిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2009 | 12:16 pm

పనితీరుతోనే సమాధానం చెప్తా: స్పీకర్

ప్రతిపక్షాలకు తనపై ఉన్న అభ్యంతరాలకు తన పనితీరుతోనే సమాధానం చెబుతానని అసెంబ్లీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అదేసమయంలో సభ సమావేశం సమయంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కలగజేస్తానని ఈ విషయంలో మహిళలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 11:24 am

రాజధానిలో మరో స్వైన్‌ఫ్లూ కేసు

రాష్ట్రంలో తాజాగా మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు అధికారికంగా నమోదైన తరుణంలో తాజాగా మరో కేసు నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు నిర్వహించిన వైద్యసేవల్లో అతనికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని అధికారులు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 10:22 am

35 మందికి వారెంట్లు జారీలో చిక్కులు: కోర్టు వర్గాలు

ముంబై దాడులకు సంబంధించి ముంబైలోని ప్రత్యేక కోర్టు పరారీలో ఉన్న 35 మందికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయలేదని కోర్టు వర్గాలు తెలిపాయి. వారెంట్లు జారీ చేయాల్సిన నిందితుల్లో జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఒకరు.
Source: జాతీయ | 4 Jun 2009 | 10:17 am

ఇంకా పక్వానికి రాలేదంటున్న "ముదురు" పాప

'దేశముదురు' చిత్రంతో కోలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ హాన్సిక. ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంకా మైనరేనట. తానింకా చిన్నపిల్లనేనని, తాను ఇంకా పరిపక్వానికే రాలేదని స్వయంగా ఊకదంపుడు ప్రచారం చేసుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2009 | 10:11 am

భారత్ అత్యంత సురక్షిత ప్రదేశం: చిదంబరం

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకంటే.. భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం గురువారం స్పష్టం చేశారు. తమ పౌరులను భారత్‌లో పర్యటించరాదని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Source: జాతీయ | 4 Jun 2009 | 9:20 am

ప్రజాసమస్యలపై పోరాడుదాం: జేసీ విజ్ఞప్తి

శాసనసభలో సభ్యులుగా అడుగుపెట్టిన తామంతా ప్రజాసమస్యలపై పోరాడదామంటూ లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు. శాసనసభల్లో జరిగే చర్చలపై ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం తమందరిపైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 9:12 am

అనవసర రాద్ధాంతం వద్దు: చిరంజీవి

సభలో అనవసర రాద్ధాంతాలు వద్దంటూ శాసనసభలో తొలిసారిగా ప్రసంగించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన తోటి సభ్యులకు హితవు పలికారు. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమని, అటువంటి సభలో ప్రతి ఒక్కరు హుందాగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 7:49 am

ఆహార భద్రత కోసం ప్రత్యేక చట్టం: రాష్ట్రపతి

దేశంలోని ప్రతి పౌరునికి ఆహార భద్రత కల్పించే నిమిత్తం ప్రత్యేక చట్టాన్ని తెచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు. ఆమె గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో చోటు చేసుకున్న కీలకాంశాలు ఇలా ఉన్నాయి.
Source: జాతీయ | 4 Jun 2009 | 6:44 am

తప్పుచేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పీఆర్పీ

తప్పుచేస్తే అధికార పక్షాన్ని నిలదీసేందుకు తాము ఏమాత్రం వెనుకాడబోమని ప్రజారాజ్యం పార్టీ స్పష్టం చేసింది. అదేసమయంలో ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 6:38 am

స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్‍‌కుమార్‌రెడ్డి

రాష్ట్ర శాసనసభ కొత్త స్పీకర్‌గా ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్ పదవికి మరెవరూ నామినేషన్ దాఖలు చేయని కారణంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సభలో వివిధ పార్టీ నేతల మధ్య స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 6:21 am

రాజధానిలో రెండో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు

రాష్ట్ర రాజధానిలో రెండో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. కెనడాలోని టొరెంటోలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లొచ్చిన ఓ వైద్య విద్యార్ధిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో పరీక్షలు జరిపిన వైద్యులు చివరకు అతనిలో హెచ్1 ఎన్1 వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 6:12 am

నేడు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయసభలను ఉద్దేశించి గురువారం ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో యూపీఏ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళ కాలంలో అమలు చేయనున్న వివిధ పథకాలు, చేపట్టనున్న ప్రాజెక్టులు, దేశ భద్రత, తీవ్రవాదంపై ప్రభుత్వం అనుసరించునున్న వైఖరి తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి.
Source: జాతీయ | 4 Jun 2009 | 5:04 am

సిక్కు గురువు భౌతికకాయం భారత్‌కు తరలింపు

ఆస్ట్రియా రాజధాని వియన్నా గురుద్వారాలో హత్యకు గురైన సిక్కు గురువు భౌతికకాయాన్ని బుధవారం భారత్ తీసుకొచ్చారు. వియన్నాలో ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన సిక్కు గురువు అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Source: జాతీయ | 4 Jun 2009 | 4:49 am

ఉద్యోగుల అవసరాలన్నీ తీరుస్తాం: వైఎస్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలన్నింటినీ ప్రభుత్వం తీరుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల చలవేనని పేర్కొన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యేలోపు వారి సొంత ఇంటి కలను తాము నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2009 | 4:23 am

బీజేపీ లోక్‌సభ ఉపనేతగా సుష్మా స్వరాజ్

బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ బుధవారం ఆ పార్టీ లోక్‌సభ ఉపనేతగా ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎల్‌కే అద్వానీ ఆమెను ఉపనేతగా నియమించారు. ఇదిలా ఉంటే రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మరో సీనియర్ నేత అరుణ్ జెట్లీని ఎంపిక చేశారు.
Source: జాతీయ | 4 Jun 2009 | 3:16 am

ఆర్తీని పెళ్లాడనున్న "జయం" రవి

నితిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించిన "జయం" చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పేరుతో తమిళంలో విజయం సాధించిన "జయం" చిత్రంలో హీరోగా నటించిన "రవి" ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడైన జయం "రవి"కి, ఆర్తీ అనే అమ్మాయితో గురువారం కళ్యాణం వైభోగంగా జరుగబోతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 6:43 pm

పాటల చిత్రీకరణలో విష్ణు, ఇలియానాల "సలీమ్"

విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "సలీమ్". చాలా కాలం తర్వాత విష్ణు చిత్రం తెరకెక్కుతోంది. గత ఏడాది ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిగ్ ఎఫ్.ఎం కూడా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 6:14 pm

"నా స్టైలేవేరు" ట్రైలర్‌ను తిలకించండి

రాజశేఖర్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రం "నా స్టైలే వేరు". దిషిర ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఈ నెల ఐదో తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సమస్యను హీరో ఎలా పరిష్కరించాడన్నదే కథాంశమని చిత్ర నిర్మాత మాగంటి గోపినాథ్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 6:08 pm

మల్లన్నను ట్రైలర్లో చూడండి

విక్రమ్ హీరోగా శ్రియ హీరోయిన్‌గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం మల్లన్న. వి.క్రియేషన్స్ పతాకంపై కళైపులి ఎస్. థాను సమర్పణలో సుశీ గణేషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 5:45 pm

బందర్కర్ చిత్రంలో ఫ్రిడా పింటో?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బందర్కర్ దర్శకత్వం వహించే చిత్రంలో, స్లమ్‌డాగ్ మిలియనీర్ హీరోయిన్ ఫ్రిడా పింటో నటించబోతుందని తెలిసింది. 8 ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న స్లమ్‌డాగ్ చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పింటోకు ఒకవైపు హాలీవుడ్ ఛాన్సులు వస్తుండగా, మరోవైపు బాలీవుడ్ ఛాన్సులు కూడా వెల్లువల్లా వస్తున్నాయి."స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఫ్రిడా పింటోతో కొత్త సినిమా చేయాలని బందర్కర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఫ్రిడాతో పనిచేయడమంటే తనకెంతో ఇష్టమని, త్వరలో ఫ్రిడాతో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు బందర్కర్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 4:27 pm

ఆన్‌లైన్‌లో మార్లిన్ మన్రో అరుదైన ఫొటోలు

హాలీవుడ్‌లో ఆనాటి మేటినటి మార్లిన్ మన్రో అరుదైనా ఛాయాచిత్రాలు ఆన్‌లైన్‌లోకి విడుదలయ్యాయి. 60 ఏళ్ల క్రితంనాటి ఈ ఫొటోలను ఆమె 83వ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ ఫొటోలను లైఫ్.కామ్ అనే వెబ్‌సెట్‌లో ఉంచారు. ఈ ఫొటోలను లైఫ్ మేగజైన్ ఫొటోగ్రాఫర్ ఎడ్ క్లార్క్ 1950వ సంవత్సరంలో తీయడం గమనార్హం.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2009 | 4:11 pm

మహిళా బిల్లును ఆమోదించేలా చర్యలు: కాంగ్రెస్

మీరాకుమార్‌ను తొలి మహిళా లోక్‌సభ స్పీకరుగా ఎన్నుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోందని ఆ పార్టీ తెలిపింది. తాము తప్పనిసరిగా ప్రస్తుత లోక్‌సభలో మహిళాబిల్లును ప్రవేశపెడతామని, దీనిగురించి తాము తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని ఆ పార్టీ గుర్తు చేసింది.
Source: జాతీయ | 3 Jun 2009 | 3:12 pm

రాష్ట్ర రాజధానిలో రెండో స్వైన్ ఫ్లూ కేసు

ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్రంలో మరో వ్యక్తికి ఉన్నట్లు బుధవారం కనుగొన్నారు. అమెరికా నుంచి హైదరాబాదు వచ్చిన 20 ఏళ్ల మెడికల్ విద్యార్థికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని హైదరాబాదులోని ఛాతి ఆసుపత్రికి తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2009 | 2:15 pm

రాజ్యసభ ప్రతిపక్షనేతగా జైట్లీ

దేశంలోనే అతి పెద్ద రెండవ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు అరుణ్ జైట్లీని రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఆ పార్టీ నియమించింది. అలాగే లోక్‌సభలో పార్టీ ఉపనాయకురాలిగా వ్యవహరించేందుకు శ్రీమతి సుష్మాస్వరాజ్‌ను ఆ పార్టీ నియమించింది
Source: జాతీయ | 3 Jun 2009 | 1:50 pm