|
నల్లధనాన్ని వెనక్కి రప్పించాలి: అద్వానీభారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే అద్వానీ స్విస్ బ్యాంకు నల్ల ధనం గురించి మరోసారి ప్రస్తావించారు. కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోందనీ, ఆ ధనాన్ని మొత్తం తిరిగి దేశానికి తీసుకురాగలిగితే భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన అన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ప్రదర్శనగా వెళుతూ మధ్యలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.Source: జాతీయ | 8 Apr 2009 | 11:46 am దమ్ముంటే అరెస్టు చేసుకోండి': మంత్రి లాలూదమ్ముంటే అరెస్టు చేసుకోండి అని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్.జె.డి) అధ్యక్షుడు, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ పోలీసులకు ఓ సవాల్ విసిరారు. ఇటీవల బీహార్లో జరిగిన ఒక ర్యాలీలో భారతీయ జనతా పార్టీ యువతనేత వరుణ్ గాంధీపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కిషన్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ లాలూపై అరెస్టు వారంట్ జారీ చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 8 Apr 2009 | 10:53 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 10:16 am ఏప్రిల్ 08, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 సుహాసిని కథలు 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 10:14 am కొత్తవారితో బ్లాక్ క్యాట్ చిత్రం ప్రారంభంపద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బంగారు బయ్యారెడ్డి దర్శక నిర్మాతగా బ్లాక్ క్యాట్ అనే చిత్రం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ బాచుపల్లిలోని జామతోటహౌస్లో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన...Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 10:06 am నాని హీరోగా 'రైడ్' చిత్రం లోగో ఆవిష్కరణఅష్టాచెమ్మ ఫేం నాని హీరోగా రమేష్వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం రైడ్. దాదాపు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోగోను సోమవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 10:05 am బికినీ గురించి ఇప్పుడు మాట్లాడను: అనుష్కప్రభాస్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిల్లా చిత్రంలో బికినీలో అందాలు ఆరబోసిన అందాల అరుంధతి అనుష్క ఆ కాస్ట్యూమ్ తనకు మరీ అంత ఎబ్బెట్టుగా ఏం లేదని సెలవిచ్చింది. అయితే ఆ క్యాస్టూమ్ గురించి తానిప్పుడు...Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 10:00 am పుట్టినరోజున ప్రచారంలోకి అల్లు అర్జున్గంగోత్రి, ఆర్య, దేశముదురు, పరుగు చిత్రాలతో యూత్ని విశేషంగా ఆకట్టుకున్న హీరో అల్లు అర్జున్ బుధవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజుకు సంబంధించి అల్లు అర్జున్కు రెండు విశేషాలున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2009 | 9:57 am నామినేషన్ను దాఖలు చేసిన ఎల్కే.అద్వానీభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి ఎల్కే.అద్వానీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలను బుధవారం దాఖలు చేశారు. గాంధీనగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన మరోసారి అదేస్థానం నంచి లోక్సభ బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే. కుటుంబ సభ్యులు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వెంటరాగా బుధవారం మధ్యాహ్నం అద్వానీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.Source: జాతీయ | 8 Apr 2009 | 9:07 am గ్రూపు-1లో రిజర్వేషన్లు వద్దు: సుప్రీం కోర్టుగ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో ఎలాంటి రిజర్వేషన్లు పాటించవద్దని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలని కోర్టు ఆదేశించింది. గ్రూపు-1 ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు పాటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రిలిమ్స్ పరీక్షల్లో రిజర్వేషన్లు వర్తించవని, అభ్యర్థుల ఎంపిక ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయాలని సుప్రీం స్పష్టం చేసింది.Source: జాతీయ | 8 Apr 2009 | 7:44 am తెంలగాణాపై కాంగ్రెస్ దాగుడు మూతలు: కేసీఆర్తెలంగాణ ఇచ్చేందుకు అభ్యంతరం లేకుంటే మరెందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ విషయంలో నిమ్మకునిరెత్తినట్టు వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేకరాష్ట్రం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 8 Apr 2009 | 7:20 am కాంగ్రెస్-పీఆర్పీలపై చంద్రబాబు విమర్శలుప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనను ఎన్టఆర్తో పోల్చుకోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిరంజీవి తనను ఎన్టీఆర్తో పోల్చుకోవడమంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 8 Apr 2009 | 7:00 am టైట్లర్కు టిక్కెట్ కేటాయింపుపై కాంగ్రెస్ యోచనకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్ లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వంపై ఆ పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి ఆ వర్గం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వీరిద్దరి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్లకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినందుకు నిరసనగా కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరంపై సిక్కు జర్నలిస్ట్ ఒకరు బూటు విసిరాడు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సిక్కుల్లో వారిపట్ల ఉన్న వ్యతిరేకత తెలిసొచ్చినట్లయింది. ఇప్పటికే టైట్లర్, సజ్జన్ కుమార్లకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 8 Apr 2009 | 6:35 am ప్రజారాజ్యంతో మార్పుకు శ్రీకారం: చిరంజీవిప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం నేతలు ప్రజల ఓట్లతో సీట్లు గెలిచి కోట్లు గడిస్తున్నారని అందుకే తరతరాలకు అవసరమైన మార్పునకు ప్రజారాజ్యం శ్రీకారం చుట్టనుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం మునుగోడు, నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేటల్లో చిరంజీవి రోడ్షోలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 8 Apr 2009 | 5:58 am మంత్రి లాలూపై కఠిన చర్యకు మల్హోత్రా డిమాండ్యువనేత వరుణ్ గాంధీ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత వీకే.మల్హోత్రా కోరారు. వరుణ్పై మంత్రి లాలూ చేసిన వ్యాఖ్యలు మతసామరస్యానికి హాని కలిగించేలా ఉన్నాయని అందువల్ల ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద (నాసా) అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.Source: జాతీయ | 8 Apr 2009 | 5:44 am సత్యం కుంభకోణం: ఛార్జిషీటు దాఖలుకార్పొరేట్ దిగ్గజం సత్యం కంప్యూటర్స్లో చోటు చేసుకున్న రూ.7,800 కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారకులుగా పేర్కొంటూ ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజుతో సహా తొమ్మిదిమందిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్ ప్రకారం మొత్తం 65 వేల పేజీలతో కూడిన నివేదికను సీబీఐ సమర్పించింది. మరో మూడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో నిందితులకు బెయిల్ మంజూరు అవుతుందన్న పరిస్థితుల్లో సీబీఐ ఈ ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సత్యం నిందితులపై త్వరలోనే విచారణ ప్రారంభం కానుంది.Source: ఏపీ న్యూస్ | 8 Apr 2009 | 4:22 am తీవ్రవాదంపై పోరు సల్పుతున్న కేంద్రం: ప్రధానిదేశంలో ప్రజ్వరిల్లుతున్న తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు కేంద్రం పోరు సాగిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆయన నొక్కివక్కాణించారు. అందుకే ఉగ్రవాదంపై అలుపెరుగని పోరు సాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 8 Apr 2009 | 3:48 am రైతుల ఆత్మహత్యల్లో యూపీఏ రికార్డు: అద్వానీకేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రైతుల ఆత్మహత్యల్లో సరికొత్త రికార్డు సృష్టించిందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. అందుకే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను అధికారం నుంచి సాగనంపాలంటూ ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.Source: జాతీయ | 8 Apr 2009 | 3:40 am 11 మంది ముఖ్యమంత్రులకు తీవ్రవాద ముప్పుతీవ్రవాదులు, నక్సలైట్ల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల 11 మంది ముఖ్యమంత్రులకు ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్రం సంబంధిత రాష్ట్ర పోలీసు యంత్రాగానికి హెచ్చరికలు పంపింది. ముఖ్యమంత్రుల భద్రతకు సంబంధించి సమీక్ష చేయాలని కూడా సూచించింది.Source: జాతీయ | 7 Apr 2009 | 2:15 pm మా హయాంలోనే తెలంగాణా అభివృద్ధి: సోనియాకాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా భువనగిరిలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సోనియాగాంధీ, కాంగ్రెస్ పాలనలో మాత్రమే తెలంగాణ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. తమ పాలనలోనే తెలంగాణలో ఐఐటీ ఏర్పడిందని పేర్కొన్న ఆమె ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని తెలిపారు. తెలంగాణ కోసం ఈ రోజు గొంతెత్తుతున్న టీడీపీ గతంలో ఈ ప్రాంతంకోసం ఏం చేసిందంటూ ఆమె ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 7 Apr 2009 | 1:03 pm పాలరాతి కావ్యం "స్వామి నారాయణ మందిరం""ఇంత అద్భుతమైన కట్టడాన్ని నేనెక్కడా చూడలేదు. చాలామంది చెబుతుంటే తెలియలేదుగానీ, కళ్లారా చూస్తేగానీ ఆ గొప్పదనం తెలియడంలేదు. వైకుంఠం ఎక్కడో లేదు. నా జీవితం ధన్యమైపోయింది" ఇలాంటి లెక్కలేనన్ని ప్రశంసలు బ్రిటన్లోని "స్వామి నారాయణ మందిరం" సొంతం.Source: వినోదం | 7 Apr 2009 | 12:59 pm పుట్టినరోజునాడే "ఆర్య" ప్రచారానికి శ్రీకారంగంగోత్రి, బన్ని, ఆర్య, దేశముదురు, పరుగు సినిమాల ద్వారా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఈ కథానాయకుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనువడు. అలాగే ఇతడు మెగాస్టార్, పద్మభూషణ్...Source: వినోదం | 7 Apr 2009 | 12:49 pm స్విస్ బ్యాంకు నల్లధనం: హైకోర్టులో పిటిషన్విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయులకు చెందిన నల్లధనంను తిరిగి దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు స్వచ్ఛంద సంస్థలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయ సంపదను దేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 7 Apr 2009 | 11:56 am మూడో వన్డేలో పుంజుకుంటాం: పాంటింగ్ ధీమాదక్షిణాఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్లో తాము తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో తమ ఓపెనర్లు బ్రాడ్ హాడిన్, మైకెల్ క్లార్క్ పుంజుకుంటారని చెప్పాడు. రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:26 am తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: సోనియాతమ పార్టీ ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉందని, తెలంగాణ అంశాన్ని ప్రాధాన్యమున్న అంశంగానే పరిగణిస్తున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:24 am ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సరసన టీం ఇండియాన్యూజిలాండ్ గడ్డపై 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ విజయం సాధించిన టీం ఇండియా తాజాగా జరిగిన సిరీస్లో ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ను 3-1తో గెలుచుకున్న టీం ఇండియా, తాజాగాSource: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:17 am వెల్లింగ్టన్ టెస్ట్ ఫలితంపై ధోనీ అసంతృప్తిటీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్ టెస్ట్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆతిథ్య దేశంతో వెల్లింగ్టన్లో జరిగిన కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ను డ్రాగా ముగించడంతో టీం ఇండియా టెస్ట్ సిరీస్ను 0Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:09 am అనుష్క చేతుల మీదుగా టిక్ టిక్ టిక్ ఆడియోఅరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై అరుణకాంత్ దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం టిక్ టిక్ టిక్. టాలీవుడ్ సెక్సీతార అనుష్క చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా అనుష్క మాట్లాడుతూ టిక్ టిక్ టిక్...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 11:04 am షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియోఅన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ జోషిత సమర్పణలో రూపొందుతోన్న రాత్రి చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ రాత్రులన్నీ ఒకేలా ఉండవని, కొన్ని రాత్రులు చేదు అనుభవాలను...Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 11:01 am షాయాజీ షిండే ప్రధాన పాత్రలో రాత్రి ఆడియోఅన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ జోషిత సమర్పణలో రూపొందుతోన్న రాత్రి చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ కార్యక్రమం సందర్భంగా దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ రాత్రులన్నీ ఒకేలా ఉండవని, కొన్ని రాత్రులు చేదు అనుభవాలను...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 11:01 am రీరికార్డింగ్లో కార్యక్రమాల్లో రోమియోశ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రోమియో. ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అగస్త్య సంగీత దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ఈ సందర్భంగా గీత రచయిత...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 10:58 am నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు...Source: Yahoo! Telugu: News | 7 Apr 2009 | 10:57 am నెలాఖరున ప్రేక్షకుల ముందుకు అధినేతజగపతిబాబు హీరోగా, సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అధినేత. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు...Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2009 | 10:57 am
|