మా ఆయన్ని అడగాలి

"నీ బట్టలు అంత తెల్లగా ఉంటాయి ఎలా ఉతుకుతావు..?" అడిగింది వినోదిని "అదేమో... నాకేం తెలుసు...
Source: వినోదం | 6 Mar 2009 | 11:26 am

వారాంతంలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 8,325 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 2,620 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 11:24 am

లంచంతో కాని పనేముంది

"లంచం తీసుకున్నందుకు ఉద్యోగం పోయిందన్నావ్..? మళ్ళీ ఎలా ఉద్యోగం వచ్చింది..?" ఆశ్చర్యంగా అడిగాడు కుమార్..
Source: వినోదం | 6 Mar 2009 | 11:23 am

గోపాలస్వామిపై ద్వేషం లేదు: నవీన్ చావ్లా

కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్. గోపాలస్వామిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న నవీన్ చావ్లా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 10:05 am

ఎన్నికలకు ఇబ్బంది లేకుండా ఐపీఎల్: మోడీ

ఐపీఎల్‌ నిర్వహణపై కమ్ముకున్న కారుమేఘాలు ఎట్టకేలకు తొలిగాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ఇబ్బంది కలిగించకుండా మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రభుత్వం, ఐపీఎల్ నిర్వాహకులు ఓ నిర్ణయానికి వచ్చారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 9:40 am

ఇవాన్‌చుక్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆనంద్

స్పెయిన్‌లో జరుగుతున్న లినారెస్ చెస్ టోర్నీలో ఆనంద్ మరోసారి ఆరో గేమును డ్రాగా ముగించాడు. ఈ టోర్నీ 12వ రౌండులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారుడైన వాస్సిలీ ఇవాన్‌చుక్‌తో ఆనంద్ తలపడ్డాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఆనంద్...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 8:15 am

ఎమ్మార్పీఎస్ కార్యకర్త దామోదర్ మృతి

గాంధీభవన్ దాడి ఘటనలో గాయపడిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త దామోదర్ మాదిగ శుక్రవారం మృతి చెందాడు. గాంధీభవన్ దాడి ఘటనలో మంటల్లో చిక్కుకున్న దామోదర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు హైదరాబాద్‌లోని...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 8:12 am

కరుణించని వర్షం: భారత్, కివీస్ మ్యాచ్ రద్దు

వెల్లింగ్టన్‌లో భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో మూడుసార్లు వాయిదాపడ్డ ఈ వన్డే చివరకు రద్దైంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 తేడాతో...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 7:59 am

ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయను: అమితాబ్

వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయబోనని బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ముంబైలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డుల ఎంపిక కోసం తన ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 6 Mar 2009 | 7:58 am

రాష్ట్రంలో శాంతిభద్రతలపై చిదంబరం సంతృప్తి

రాష్ట్రంలో శాంతిభద్రతల ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి పి చిదంబరం సంతృప్తి వ్యక్తం చేశారు. నక్సల్స్‌ను అణగద్రొక్కడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని విశ్లేషించారు. ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యే అయినా రానున్న...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 7:50 am

ఐపీఎల్ రీషెడ్యూల్ తప్పనిసరి: చిదంబరం

సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఉండడంతో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ ఐపీఎల్ షెడ్యూల్‌ను మార్చడం...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 7:16 am

టీడీపీలోకి కాంగ్రె నేత... కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత

ఎన్నికల తరుణం ముంచుకొస్తున్న వేళ పార్టీల్లోకి వలసల సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్, టీడీపీల్లో పలుకుబడి కలిగిన ఇద్దరు నేతలు పార్టీల కండువాలు మార్చుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 7:01 am

మల్లేశ్వరస్వామి ఆలయానికి రామానాయుడి వితరణ

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువుతీరిన మల్లేశ్వరస్వామి ఆలయ ద్వారాలకు ప్రముఖ నిర్మాత డాక్టర్. డి. రామానాయుడు వెండి తాపడాలు చేయించారు. దాదాపు ఏడు లక్షల రూపాయల వ్యయంతో 26.5 కేజీల వెండిచే ఈ తలుపులకు తాపడాలు చేయించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2009 | 6:53 am

నిర్మాత యం.ఆర్.వి. ప్రసాద్ కుమార్తె వివాహం

యువరత్న బాలకృష్ణ తోడల్లుడైన యం.ఆర్.వి. ప్రసాద్ తన కుమార్తె ఉమ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వివాహానికి సినీ ప్రపంచం పెద్ద ఎత్తున తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించింది. మార్చి 5న ఉదయం 7.28 ని.లకు జరిగిన ఈ...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2009 | 6:51 am

చివరి షెడ్యూల్‌లో "కలవరమాయే మదిలో"

"ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Source: వినోదం | 6 Mar 2009 | 6:38 am

నెల రోజుల్లో కరిష్మా కోర్టుకు హాజరుకావాలి: హైకోర్టు

బాలీవుడ్ నటీనటులు సన్నీ డియోల్, సతీష్ షా‌లతో సహా బాలీవుడ్ ముద్దుగుమ్మ కరిష్మా కపూర్‌లు నెల రోజుల్లో కోర్టుకు హాజరుకావాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా రైలును ఆపిన వ్యవహారానికి సంబంధించి వీరిపై కేసు నమోదై ఉంది. ఈ కేసుకు సంబంధించి నెల రోజుల్లో జైపూర్‌లోని అడిషినల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (రైల్వే) కోర్టులో హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Source: జాతీయ | 6 Mar 2009 | 6:24 am

భాజపా-ఏజిపి పొత్తుతో నష్టం లేదు: కాంగ్రెస్

అస్సోం గణపరిషత్ పార్టీ (ఏజిపి), భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల సయోధ్య ఏర్పడటం తమకెలాంటి నష్టం వాటిల్లబోదని అస్సోం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఏజిపి, భాజపా శ్రేణులు మాత్రం ఈ పొత్తు పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 14 పార్లమెంట్ స్థానాలకు గాను భాజపా ఎనిమిది చోట్ల, ఏజిపి ఆరు చోట్ల పోటీ చేయనున్నాయి.
Source: జాతీయ | 6 Mar 2009 | 5:59 am

నేడు భారత పర్యటనకు రానున్న ముషారఫ్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం భారత్‌కు విచ్చేయనున్నారు. ఇండియా టుడే ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న ఓ సదస్సులో పాల్గొనేందుకై ముషారఫ్ భారత్‌కు విచ్చేయనున్నారు. ముషారఫ్ పాల్గొననున్న ఈ సదస్సులో...
Source: Yahoo! Telugu: News | 6 Mar 2009 | 5:51 am

ఎన్నికల సమరం: భాజపా మరో జాబితా విడుదల

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. ఇందులో ఆ పార్టీ మహిళా సీనయర్ నేత సుష్మాస్వరాజ్‌, కైలాష్ జోషీలతో సహా 46 మందికి సీట్లు కేటాయించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి సుష్మా బరిలోకి దిగుతారు. అలాగే, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కైలాష్ జోషీ భోపాల్ స్థానం నుంచి పోటీ చేస్తారు.
Source: జాతీయ | 6 Mar 2009 | 5:38 am

జార్ఖండ్‌లో నేటి నుంచి అద్వానీ ప్రచారం

రాజకీయ సంక్షోభంలో కూరుకుని రాష్ట్రపతి పాలనలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునున్నారు. దేశంలో స్టీల్‌ సిటీగా పేరుగాంచిన జెంషెడ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగే భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ పార్లమెంట్ స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా పోటీ చేస్తారు. ఈ విషయాన్ని జార్ఖండ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రఘుబార్ దాస్ వెల్లడించారు.
Source: జాతీయ | 6 Mar 2009 | 4:26 am

కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు: జయలలిత

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తమతో చేతులు కలపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించలేదని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వివరణ ఇచ్చారు. అసలు తమ కూటమిలో చేరాల్సిందిగా కాంగ్రెస్‌ను ఏదశలోనూ పిలవలేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేతోనే కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 6 Mar 2009 | 4:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2009 | 3:16 am

మార్చి 06, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2009 | 3:12 am

సుష్మా స్వరాజ్‌కు విదిషా టికెట్

రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను భారతీయ జనతా పార్టీ గురువారం 46మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఎనిమిది మంది మహిళలను లోక్‌సభకు పంపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతోబాటు 166మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. కాగా బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ విదిషా స్థానంనుంచి పోటీలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా ఇండోర్ స్థానంనుంచి ప్రస్తుత ఎంపీ సుమిత్రా మహాజన్‌కు మరోమారు పోటీ చేయడానికి అవకాశం లభించింది
Source: జాతీయ | 5 Mar 2009 | 2:54 pm

ఓటీస్ షరతులకు అంగీకరించని భారత్!

జాతిపిత మహాత్మాగాంధీ వాడిన అమూల్యమైన వస్తువులు కలిగిన అమెరికా వస్తు సేకరణకర్త జేమ్స్ ఓటిస్ విధించిన షరతులను భారత్ తోసిపుచ్చింది. దీంతో గాంధీజీ వస్తువుల కైవసంలో మళ్లీ చిక్కులు ఉత్పన్నమయ్యాయి. గాంధీజీ వాడిన వివిధ రకాల వస్తువులు అమెరికాకు చెందిన జేమ్స్ ఓటిస్ దగ్గర ఉన్నాయి. ఆంటీ కోరం ఆక్షనర్స్ అనే సంస్థ ఈ వస్తువులను గురువారం వేలం వేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:43 pm

భాజపా తీర్థం పుచ్చుకున్న నిర్మలా వెంకటేష్

మంగళూరు పబ్‌లో మహిళలపై దాడి సంఘటనకు సంబంధించి ఖచ్చితమైన నివేదికను సమర్పించనందుకు బాధ్యురాలిని చేస్తూ.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన నిర్మలా వెంకటేష్ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:25 pm

రాజకీయాలా... అవేమంత కష్టం కాదు: అజహర్

రాజకీయాలా... అవేమంత కష్టమైనవి కావంటున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్. కాంగ్రెస్ అధిష్టానం తనను పోటీకి ఆదేశిస్తే దేశంలోని ఏ నియోజవర్గం నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ఫలానా నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే నిర్దుష్టమైన అభిప్రాయామేదీ తనకు లేదన్నాడు. ఒకవేళ అధిష్టానం ఇండోర్ నుంచే పోటీ చేయమని ఆదేశిస్తే... పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపాడు.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:24 pm