మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 330 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో 129 పాయింట్లు వృద్ధితో 8,803 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌‍బీఐ)
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 11:39 am

మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలరీత్యా ఇటీవల ఆస్పత్రిలో చేరిన 98ఏళ్ల వెంకట్రామన్ వృధ్యాప్య కారణాలతో మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన...
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 11:31 am

టీం ఇండియా విజయాలకు ధోనీ, కిర్‌స్టన్ కారణం

ప్రపంచ క్రికెట్‌లో టీం ఇండియా కీలక శక్తిగా ఎదగడం వెనుక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఘనత ప్రధానంగా వారిద్దరికే దక్కుతుందన్నాడు.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 11:30 am

మిక్స్‌డ్ డబుల్స్ నుంచి పేస్- బ్లాక్ నిష్క్రమణ

భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్- అతని డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ నుంచి వెనుదిరిగారు. మంగళవారం జరిగిన రెండో రౌండు పోరులో టాప్ సీడ్ పేస్- కారా బ్లాక్ అన్‌సీడెడ్ క్రీడాకారులు
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 11:19 am

విద్యార్థులకు యోగా శిక్షణ అవసరం: రాందేవ్

పాఠశాల స్థాయినుంచే యోగా శిక్షణ ఇప్పించడం ద్వారా మనిషి చక్కని ఆరోగ్యాన్ని చక్కని జీవితాన్ని సాధించవచ్చని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. అందుకే పాఠశాలల్లో యోగాను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 11:14 am

ఆఫ్ఘన్‌లో ప్రమాదకర పరిస్థితులు: వైట్‌హోస్

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం అభిప్రాయపడింది. కొత్త అధ్యక్షుడు ఒబామా యంత్రాంగం పరిస్థితులు చేయిదాటకుండా చూసేందుకు కృషి చేస్తుందని వైట్‌హోస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 10:39 am

సత్యం ఆడిటర్లకు బెయిల్: విచారణ వాయిదా

సత్యం సంస్థకు ఆడిటింగ్ కార్యకలాపాలు చక్కబెట్టిన ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ గోపాలకృష్ణ, డిప్యుటీ ఇన్‌ఛార్జి తాళ్లూరి శ్రీనివాస్‌ల బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి. ఈ బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన...
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 10:32 am

మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు 98 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన్ను గత వారం ఆస్పత్రిలో చేర్చి కృత్రిమ శ్వాసను అందిస్తూ వచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 27 Jan 2009 | 10:16 am

తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలుగుదేశం పార్టీ తరపున శాసన మండలికి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎలాంటి పదవులు లభించని మహిళా నేత నన్నపనేని రాజకుమారికి ఎట్టకేలకు ఎమ్మెల్సీ టిక్కెట్ లభించింది.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 9:49 am

మంగళూరులో పబ్‌పై దాడి: ఎనిమిది మంది అరెస్ట్

మంగళూరు పబ్ దాడిపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడి ఓ పబ్‌కు వచ్చిన బాలికలు, ఇతరులపై శ్రీరామ సేన కార్యకర్తలు శనివారం దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ దాడికి సంబంధించి తాజాగా మరో ఎనిమిది
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 9:38 am

తమిళులను భాదితులు కాకుండా చూస్తాం: ప్రణబ్

విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళుతున్న సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ.. ఎల్టీటీఈపై భారత్ జాలి చూపించబోదని స్పష్టం చేశారు. అయితే శ్రీలంకలో ప్రభుత్వ దళాలకు, వేర్పాటువాద ఎల్టీటీఈకి
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 8:39 am

వేగంగా కోలుకుంటున్న మన్మోహన్: వైద్యులు

రెండోసారి బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వేగంగా కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు కేఎస్ రెడ్డీ తెలిపారు. మంగళవారం నుంచి ఆయనకు సాధారణ ఆహారం అందించనున్నట్లు చెప్పారు. ప్రధాని బాగా కోలుకుంటున్నారు
Source: Yahoo! Telugu: News | 27 Jan 2009 | 8:22 am

కొలంబోకు వెళ్లనున్న మంత్రి ప్రణబ్ ముఖర్జీ

కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్లనున్నారు. స్థానికంగా ఎల్టీటీఈ తీవ్రవాదులకు, లంక సైన్యానికి మధ్య సాగుతున్న పోరు చివరి అంకానికి చేరుకున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 27 Jan 2009 | 7:56 am

నాసిక్‌లో ఎంఎన్ఎస్ కార్యకర్తల వీరంగం

హారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు మరోమారు వీరంగం సృష్టించారు. నాసిక్‌లోని ఒక పాఠశాలలో ముంబై మారణహోమం అమరవీరుల స్మృత్యర్థం భోజ్‌పురి వాసులు (ఉత్తర భారతీయులు) నిర్వహిస్తున్న కార్యక్రమంపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు.
Source: జాతీయ | 27 Jan 2009 | 7:54 am

రచయితల సంఘం అధ్యక్షునిగా పరుచూరి

ఆంధ్రప్రదేశ్ సినీ రచయితల సంఘం అధ్యక్షునిగా డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పి. చంద్రశేఖర ఆజాద్, కోశాధికారిగా సత్యం ఎంపికైనట్టు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రచయితల...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 7:09 am

ఇకపై ప్రేక్షకులకు నచ్చే పాత్రలే చేస్తా: కృష్ణ

ఇకపై ప్రేక్షకులకు నచ్చే పాత్రలే చేస్తానని మొహమాటానికి పోయి ఏది పడితే ఆ పాత్రలు చేయబోనని సూపర్‌స్టార్ కృష్ణ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందిన సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 7:08 am

ప్రేక్షకులను ఆకట్టుకోలేని మస్త్

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శివాజీ, శివబాలాజీ, ఆంచల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మస్త్. కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి, జీమోసన్ పిక్చర్స్ కలిసి చేసిన ఈ మస్త్ చిత్ర ప్రయోగం ప్రేక్షకులకి మాత్రం...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 7:04 am

వేసవి సెలవుల్లో చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి

టెన్త్‌క్లాస్, నోట్‌బుక్ చిత్రాల దర్శకుడు చందు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం వేసవి సెలవుల్లో. హాసిని మీడియా టౌస్ సమర్పణలో అగస్త్య ప్రొడక్షన్స్ బేనర్‌పై అగస్త్య, నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 7:00 am

ఇలియానా నటన సూపర్: సురేందర్‌రెడ్డి

దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా అటుపై నటించిన అన్ని చిత్రాల్లో తన అందచందాల్తో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జల్సా చిత్రంలో పవన్‌కళ్యాణ్ సరసన నటించిన ఈ సుందరి ప్రస్తుతం
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 6:59 am

శివ దర్శకత్వంలో గోపీచంద్, త్రిషల కొత్త చిత్రం

శౌర్యంతో గోపీచంద్‌కు సూపర్‌హిట్ అందించిన దర్శకుడు శివ మరోసారి గోపీచంద్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన త్రిష నటించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 6:55 am

29న సీడబ్ల్యుసి భేటీ: మేనిఫెస్టోపై చర్చ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ఈనెల 20వ తేదీన భేటీ కానుంది. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించిన ఎన్నికల ప్రణాళికకు తుదిరూపు ఇస్తారు. ఈ విషయాన్ని మంగళవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 27 Jan 2009 | 6:06 am

విద్యార్థిని గొంతు కోసిన సహ విద్యార్థి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ యాసిడ్ దాడి సంఘటనను మరచిపోకముందే ఒంగోలు జిల్లాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. ఒక విద్యార్థి సాటి విద్యార్థిని గొంతు కోశాడు. అనంతరం కళాశాల భవనంపై నుంచి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 5:53 am

కృష్ణా "రాజ్యం"లో తారాస్థాయికి వర్గ పోరు

కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ప్రజారాజ్యం పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంది. గణతంత్ర దినోత్సం రోజున జాతీయ జెండా సాక్షిగా.. జిల్లా కేంద్రంలోని పీఆర్పీ కార్యాలయం రణతంత్రంగా మారింది. జిల్లాలోని మూడు వర్గాల మధ్య నెలకొన్న వర్గ పోరు చిలికి చిలికి గాలివానలా మారింది.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 5:44 am

తమిళనాడులో ఖైదీలకు అక్షరాస్యతా పథకం

తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జైళ్లలో 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఉద్దేశించిన పథకాన్ని జైళ్ల విభాగం గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించింది. ఈ మేరకు జైళ్లలోని ఖైదీలందరికీ త్వరలోనే పలకా, బలపం అందజేస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ ఆర్. నటరాజన్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 27 Jan 2009 | 5:30 am

మంగుళూరు సంఘటనపై కేంద్రం సీరియస్

కర్ణాటక రాష్ట్రం, మంగుళూరులోని ఓ పబ్‌‌లో సేద తీరుతున్న యువతులపై శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. సంఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే భారతీయ జనతా పార్టీతో సహా, అన్ని రాజకీయ పక్షాలు దాడి సంఘటను తీవ్రంగా ఖండించాయి.
Source: జాతీయ | 27 Jan 2009 | 4:17 am

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

త్వరలో జరుగనున్న శాసన మండలి ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సోమవారం సాయంత్రం ఏడుగురు పేర్లను పార్టీ ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 4:08 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 4:03 am

జనవరి 27, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Jan 2009 | 4:01 am