కొలిక్కి రానీ లారీల సమ్మె: సుప్రీంలో వాజ్యం

తమ డిమాండ్ల పరిష్కారం కోసం అఖిల భారత లారీల యజమానుల సమాఖ్య తలెపెట్టిన నిరవధిక సమ్మె శనివారానికి ఆరో రోజుకు చేరుకుంది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, లారీ యజమానుల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు.
Source: జాతీయ | 10 Jan 2009 | 12:29 pm

సత్యం 'రాజు'కు బెయిల్ కూడా సందేహమే!

సత్యాన్ని అసత్యం చేసిన బైర్రాజు రామలింగ రాజుకు బెయిల్ దొరకడం కూడా సందేహాస్పదంగా మారింది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై నమోదు చేసిన కేసుల తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా సత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన ఏడు వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి సంబంధించి సత్యం రాజుపై పలు కేసులు నమోదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 12:20 pm

న్యూస్‌ఎక్స్ ఇక సరికొత్త అధ్యాయం సృష్టిస్తుంది

నయీదునియా సిఇఓ, వెబ్‌దునియా వ్యవస్థాపకులు వినయ్ ఛజ్‌లాని మరియు బిజినెస్ వరల్డ్ మాజీ సంపాదకులు జహంగీర్ పోచాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండీ మీడియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా న్యూస్‌ఎక్స్‌కు చెందిన షేర్లను శుక్రవారం నాడు కొనుగోలుచేశారు.
Source: జాతీయ | 10 Jan 2009 | 10:45 am

మున్సిపల్ ఉద్యోగులకు వైఎస్సార్ వరాలు

రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సరికొత్త వరాలను ప్రకటించారు. మున్సిపాలిటీకి ఇచ్చే గ్రాంట్‌ను ఏప్రిల్ నుంచి జీతాల రూపంలో ఇవ్వనున్నట్లు ఆయన శనివారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 10:00 am

ప్రజా ఆస్తులపై కాంగ్రెస్ స్వారీ: చిరంజీవి

రాష్ట్ర ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ పార్టీ స్వారీ చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా శుక్రవారం దర్శి, పొదిలి, అద్దంకిలలో ఆయన రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 7:26 am

ఆ 'రాజు' లొంగుబాటు... ఈ 'రాజు'కు ఊరట

భైర్రాజు రామలింగ రాజు లొంగుబాటుతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కాస్త ఊరట లభించింది. సత్యం సంస్థ నిధుల దుర్వినియోగంలో తన 'హస్తం' ఉందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు కాస్త ఫుల్‌స్టాఫ్ పెట్టగలిగారు. అంతేకాకుండా రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించగలిగారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 7:14 am

జార్ఖండ్ ఉప ఎన్నికల్లో మళ్లీ సోరేన్ పోటీ!

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో చావుదెబ్బతిన్న జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూ సోరేన్‌ ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పీఠాన్ని తన వద్దే అట్టిపెట్టుకునేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తున్నారు. తాజాగా తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించారు.
Source: జాతీయ | 10 Jan 2009 | 5:26 am

ప్రరాపాతో పాలకుల వెన్నులో వణుకు: చిరు

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో అధికార కాంగ్రెస్ పాలకుల వెన్నులో వణుకు పుడుతోందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవి ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రజా అంకిత యాత్రలో నిమగ్నమై ఉన్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 4:28 am

సోరేన్.. ప్రజల తీర్పును శిరసా వహించు: కాంగ్రెస్

జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సోరేన్‌ ప్రజల తీర్పును విధిగా శిరసావహించాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. 'ఇది ముఖ్యమంత్రి సోరేన్‌కు ప్రజలు నేర్పిన గుణపాఠం. యూపీఏకు చెంపపెట్టులాంటిది. అందువల్ల ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి' అని ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 10 Jan 2009 | 4:10 am

జనవరి 10, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2009 | 4:05 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 10 Jan 2009 | 4:03 am

'రాజు' లొంగుబాటు: మేమే అరెస్టు చేశాం - డిజిపి

రాజు కలల సౌథం కళ్ళ ముందే కుప్పకూలనుంది. ఈ దృశ్యాన్ని తన కళ్ళతో చూడలేని రాజు చట్టం ముందు లొంగిపోయారు. పలు నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం తన కుటుంబ సభ్యులతో వచ్చిన రామలింగ రాజు దర్జాగా డిజిపి కార్యాలయానికి వచ్చి శుక్రవారం అర్థరాత్రి లొంగి పోయారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jan 2009 | 3:46 am

అవినీతికి చరమగీతం పాడండి : మెగాస్టార్

దేశంలో, రాష్ట్రంలో వేళ్ళూనుకున్న అవినీతి వటవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి, అవినీతికి చరమగీతం పాడాలని.. ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి యువతకు శుక్రవారం పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 9 Jan 2009 | 12:48 pm

ఛత్తీస్‌గఢ్‌లో 15 మంది గిరిజనుల ఊచకోత

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. ఇప్పటికే చరిత్రలో చెరిగిపోని మచ్చ వేసుకున్న సల్వాజుడుం కార్యకర్తలు గురువారం మరో ఘాతుకానికి బరితెగించారు. మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానం వ్యక్తం చేస్తూ 30 మంది గిరిజనులను అపహరించారు.
Source: జాతీయ | 9 Jan 2009 | 12:46 pm

ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి: చిదంబరం

లారీ యాజమాన్య సంఘాలు, ఆయిల్‌ ట్యాంకర్లు నిరవధిక సమ్మె కొనసాగిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. లారీ సమ్మె వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిందన్నారు.
Source: జాతీయ | 9 Jan 2009 | 12:45 pm