మళ్లీ మళ్లీ ఆడియో ఆవిష్కరణ

స్కంధ, కళ్యాణి జంటగా నటించిన చిత్రం "మళ్లీ మళ్లీ". శ్రీ సహస్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దినేష్‌కుమార్ నిర్మాత. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 12:08 pm

నేనింతే తీసినందుకు గర్వపడుతున్నా: పూరీ

రవితేజ, శియా జంటగా నటించిన చిత్రం "నేనింతే". ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కథ. జీవితంలో కష్టాలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరి కథ ఇది. ఈ సినిమా చూసినవారందరూ
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 11:44 am

బాబ్లీ ప్రాజెక్టుపై ఢిల్లీలో విపక్షాల మహాధర్నా

బాబ్లీ ప్రాజెక్టుతో సహా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పలు ఇతర ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు డిసెంబర్ 11న దేశరాజధాని ఢిల్లీనగరంలో భారీస్థాయి ధర్నాను నిర్వహిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Dec 2008 | 9:54 am

ముంబై తాజ్ హోటల్లో మళ్లీ అగ్నిప్రమాదం

దక్షిణ ముంబైలోని తాజ్ హోటల్ నూతన భవంతిలోని 20, 21 ఫ్లోర్‌ల మధ్య మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నవంబర్ 26వ తేదీన ఉగ్రవాద దాడులకు గురైన అనంతరం ఈ భవంతిని ఖాళీగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అగ్నిమాపక దళం అధికారులు మాట్లాడుతూ, ఈ తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగినప్పుడు భవంతిలో ఎవరూ లేరని చెప్పారు.
Source: జాతీయ | 9 Dec 2008 | 7:54 am

డిసెంబరు 09, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హునుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 7:10 am

మహారాష్ట్రలో 39 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 39 మంది మంత్రులచేత రాష్ట్ర గవర్నర్ ఎస్‌సి జమీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 29 మంది కేబినెట్ స్థాయి మంత్రులు కాగా తక్కినవారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటుగా 10 మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా ఉప ముఖ్యమంత్రి చగన్ భుజబల్‌తో సహా 15 మంది మంత్రులు ఎన్సీపీకి చెందినవారు. జన సురాజ్య పార్టీకి చెందిన మరొక మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Source: జాతీయ | 9 Dec 2008 | 7:09 am

అమ్మను చూడాలనుంది ప్లీజ్: కసావ్ వేడికోలు

ముంబై దాడుల ఘటనలో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసావ్ తను చేసిన దారుణ చర్యపట్ల పశ్చాత్తాపంతో శనివారం రాత్రి పోలీసు కస్టడీలో కుప్పగూలిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. 'దయచేసి నన్ను క్షమించండి, నాకు మా అమ్మను చూడాలనుంది, నా మాతృదేశమైన పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలనుంది' అంటూ కసావ్ భోరున విలపించాడని తనను ప్రశ్నిస్తున్న పోలీసులు చెప్పారు. తనకు బతకాలని ఉందంటూ కసావ్ ఏడ్చాడని తెలిపారు.
Source: జాతీయ | 9 Dec 2008 | 5:53 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2008 | 5:05 am

వెబ్‌దునియా సర్వే 2008లో పాల్గొనండి

గత ఏడాదిలానే ఈ ఏడాది వెబ్‌దునియా జాతీయ మరియు ప్రాంతీయ సర్వేని చేపట్టింది. ఈ సర్వే ద్వారా వీక్షకులు తమకు ఇష్టమైన వ్యక్తులను ఎన్నుకోవచ్చు. జాతీయ సర్వే‍‌లో వివిధ విషయాలపై పది రకాల ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. వీటిలో ప్రతి ప్రశ్నకు 10 ఎంపికలను ఇచ్చాం.
Source: జాతీయ | 8 Dec 2008 | 2:37 pm

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా

మినీ సార్వత్రిక ఎన్నికలుగా పేర్కొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు చోట్ల అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ గెలుపు సాధించింది. మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని నిలబెట్టకునే దిశగా సాగుతోంది.
Source: జాతీయ | 8 Dec 2008 | 2:34 pm

మధ్య భారతంలో తిరిగి అధికారంలోకి భాజపా

మధ్య భారతంగా పిలిచే మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌‌‌ఘడ్‌లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టిన ప్రజాహిత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి ఈసారి అడ్డంకిగా మారాయి.
Source: జాతీయ | 8 Dec 2008 | 2:25 pm

'యువరాజ్యం' అధ్యక్షుడిగా 'పవర్ స్టార్'

ప్రజారాజ్యం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తొలి అడుగు వేసింది. పార్టీ యువజన విభాగం (యువరాజ్యం) అధ్యక్షుడిగా, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం స్వయంగా ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 1:27 pm

పొత్తులకు పీఆర్పీ ద్వారాలు తెరిచే ఉన్నాయి: చిరు

తమ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని భావించే వారికి తమ తలుపులు తెరిచే ఉన్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా తన 'తమ్ముడు' పవన్ కళ్యాణ్‌ను పేరును అధికారికంగా ఆదివారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 1:25 pm

చెక్‌ పోస్టులో పౌరసరఫరా శాఖ డైరక్టర్ తనిఖీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ సమీపంలో ఉన్న బిపి.పాళెం చెక్‌పోస్టును రాష్ట్ర పౌర సరఫరాల డైరక్టర్ సుబ్రహ్మణం ఇటీవల సందర్శించి, అక్కడి తనిఖీలను ఆయన సమీక్షించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2008 | 1:21 pm

బాబ్లీపై సుప్రీం విచారణ మార్చి 24కు వాయిదా

మహారాష్ట్ర సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై విచారణను సుప్రీంకోర్టు మంగళవారం మార్చి 24కు వాయిదా వేసింది. సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తులు అనంతరం దీనిని ఏకంగా మార్చి 24కు వాయిదా వేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2008 | 11:54 am