లైఫ్‌స్టైల్ 90 శాతం షూటింగ్ పూర్తి

ముప్పలనేని శివ దర్శకత్వంలో ఓరుగంటి మధుసూధనరెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం "లైఫ్‌స్టైల్". ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 12:07 pm

వింత అనుభవాలతో రాత్రి

ఒక్క రాత్రిలో ఎదురైన వింత అనుభవాల సమాహారంతో "రాత్రి" అనే చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కిరణ్‌కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భానుకిరణ్ దర్శకుడు. ఈ నెల 7న సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 12:03 pm

డిసెంబర్‌లో మహేష్‌బాబు సినిమా షూటింగ్

మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ముందుగా యాక్షన్‌పార్ట్, ఛేజింగ్ తీయనున్నారు. తరువాత పాటలు, సన్నివేశాల తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 11:56 am

జగపతి, కళ్యాణ్‌ల కొత్త చిత్రం ఘనుడు

జగపతిబాబు, కళ్యాణ్‌రామ్, స్నేహ ఉల్లాల్, రూపాకౌర్, సింధూ మీనన్ హీరోహీరోయిన్లుగా ఒక కొత్త చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ధనరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 11:51 am

నెలాఖరున "సిలువ నీడలో" రెండో షెడ్యూల్

విజయభాస్కర్, మల్లికాకపూర్, సైరాభాను, రంగనాథ్, వేణుమాధవ్, రామిరెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం "సిలువ నీడలో". సెయింట్ అంటోనీకి సంబంధించిన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 11:43 am

వచ్చే నెల 4న కుబేరుల విడుదల

శివాజీ, అలీ, కృష్ణ భగవాన్ ప్రధాన తారాగణంగా గోదావరి టాకీస్ పతాకంపై రూపొందిన చిత్రం "కుబేరులు". శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు నిర్మిస్తున్నారు. సినిమాను వచ్చే నెల 4న
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 11:33 am

ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: చిరంజీవి

ముంబై వరుస పేలుళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకంజ వేస్తున్న కేంద్ర హోం మంత్రి శివరాజ్‌ పాటిల్ పేలుళ్ళకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2008 | 11:14 am

ప్రభుత్వ వైఫల్యంతోనే ముంబై పేలుళ్లు:చిరు

ప్రభుత్వ వైఫల్యంతోనే ముంబై పేలుళ్లు చోటు చేసుకున్నాయని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ఆరోపించారు. ప్రభుత్వం చేతగాని తనం కారణంగానే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పేలుళ్లను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 11:13 am

హత్య కేసునుంచి కేకే కుమారుడు విడుదల

రియాల్టర్ ప్రశాంత్ రెడ్డి హత్య కేసు నుంచి మాజీ పీసీసీ చీఫ్ కే కేశవరావు తనయుడు వెంకట్ గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. తగిన సాక్ష్యాధారాలు లేదని చెబుతూ, ఆయనపై మోపిన హత్యానేర అభియోగాలను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 11:06 am

పేలుళ్లతో ఛాంపియన్స్‌ లీగ్‌పై నీలినీడలు

ముంబై పేలుళ్ల నేపథ్యంలో ట్వంటీ 20 ఛాంపియన్ లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంగ్లాండ్ నుంచి మిడిల్‌సెక్స్, ఆస్ట్రేలియా నుంచి విక్టోరియా, పశ్చిమాస్ట్రేలియా జట్లు రాకపోవడంతో ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 10:58 am

మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ కన్నుమూత

మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ (77) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం దేశంలో తొలిసారి ఏర్పాటయిన కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఘనత దక్కించుకున్న వీపీ సింగ్, చాలాకాలం
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 10:55 am

32 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

దేశంలో 32 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.845.70 కోట్లు. రాఘవ్ బాహ్ నేతృత్వంలోని టెలివిజన్ 18 ఇండియా ప్రతిపాదనలకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 10:42 am

ముంబయి దాడులకు యుద్ధ రీతిలో జవాబు

ముంబయిలో తీవ్రవాద దాడులకు యుద్ధ రీతిలో జవాబిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ముంబయిలో తీవ్రవాద దాడులను యుద్ధంగా వర్ణించడంతోపాటు, తీవ్రవాదులకు
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 10:25 am

మీ దయ వల్లే ఇక్కడ ఉన్నాం: డీఎస్

పార్టీ కార్యకర్తల దయ వల్లే తాము వేదికలను ఎక్కుతున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం డిసిసి అధ్యక్షుడు గడుగు గంగాధర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో డీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2008 | 10:15 am

కనువిందు చేసిన నౌకాదళ వారోత్సవాలు

నౌకాదళ వారోత్సవాల్లో భాగంగా తూర్పు నౌకాదళం నిర్వహించిన నౌకా విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా భావించే విశాఖపట్నంకు సుమారు 30 నాటికన్ మైళ్ళ దూరంలోని బంగాళాఖాతానికి తూర్పు దిశన ఈస్ట్రన్ నేవీ కమాండ్ ఈ విన్యాసాలను నిర్వహించింది.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2008 | 10:08 am

ముంబయి దాడులు: దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

ముంబయిలో బుధవారం రాత్రి తీవ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబయిలో తీవ్రవాదులు తొమ్మిది ప్రదేశాల్లో బాంబు దాడులు జరపడంతోపాటు, ఏకే- 47 తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 10:03 am

డిస్కౌంట్‌తో పోస్టాఫీసుల్లో బంగారు నాణేల విక్రయం

పోస్టాఫీసుల్లో బంగారు నాణేల విక్రయాన్ని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ యశోధరమీనన్ బుధవారం ప్రారంభించారు. అబిడ్స్‌లోని జీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విక్రయాలను ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 9:52 am

ముంబై పేలుళ్లతో రాజధానిలో గట్టి బంధోబస్తు

ముంబై పేలుళ్ల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో బంధోబస్తు పటిష్టం చేశారు. ప్రైవేటు హోటళ్లు, ప్రధాన కార్యాలయాల వద్ద భద్రతను పెంచడంతో పాటు హోటళ్లు, లాడ్జిలలో ఉన్న వారి జాబితాను పరిశీలిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 9:30 am

పేలుళ్లతో భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన రద్దు

ముంబైలో బుధవారం నాటి బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత్‌లో తమ పర్యటనను ఇంగ్లాండ్ జట్టు రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా మరో రెండు వన్డేలు, రెండు టెస్టుల్లో తలపడాల్సి ఉన్నప్పటికీ, ఆ జట్టు తమ పర్యటన రద్దు చేసుకుని వెల్లిందని పేరు చెప్పడానికి...
Source: Yahoo! Telugu: News | 27 Nov 2008 | 8:14 am

పీఆర్పీ అధికారంలోకి రావడమే లక్ష్యం: మిత్రా

అండగా ఉంటుందని మిత్రా ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2008 | 7:50 am

నవంబరు 27, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 3:47 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2008 | 3:45 am

ఉగ్రవాదంపై కఠిన చర్యలు: అద్వానీ డిమాండ్

బుధవారం రాత్రి ముంబైనగరంలో ఉగ్రవాదులు భారీ స్థాయిలో కాల్పులు జరిపి 80 మందికి పైగా ప్రజలను పొట్టన బెట్టుకున్న నేపథ్యంలో, నగరంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ప్రతిపక్ష నేత అద్వానీ డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 26 Nov 2008 | 11:54 pm

ముంబైలో ఉగ్రవాద దాడులపై ప్రధాని ఖండన

బుధవారం రాత్రి ముంబై నగరంలో ఉగ్రవాదులు చేపట్టిన విచక్షణారహిత దాడులను ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి అవసరమై సహాయాన్ని అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌తో ప్రధాని సంప్రదిస్తున్నారని ముంబైలో పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
Source: జాతీయ | 26 Nov 2008 | 11:39 pm

తాజ్ హోటల్‌లో కాల్పుల కొనసాగింపు

బుధవారం ఉగ్రవాదుల దాడికి గురైన స్టార్ హోటళ్లు తాజ్, ట్రైడెంట్‌లలో దాగిన ఉగ్రవాదులను బంధించడానికి సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రెండు హోటళ్లలో ఉగ్రవాదులు ప్రవేశించి వీటిలో బస చేసిన వారిని బందీలుగా పట్టుకున్నట్లుగా వార్తలు రావడంతో ఉగ్రవాద నిరోధక బృందం -ఏటీఎస్- హుటాహుటిన అక్కడికి వెళ్లింది.
Source: జాతీయ | 26 Nov 2008 | 11:13 pm

ముంబై పేలుళ్లు: దక్కన్ ముజాహిదీన్ పాత్ర

బుధవారం రాత్రి దక్షిణ ముంబైలో విరుచుకుపడి 80 మంది ప్రజలను చంపి 900 మందిని గాయపర్చిన ఘటనకు తమదే బాధ్యత అని దక్కన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాదం సంస్థ ప్రకటించింది. నగరం మొత్తంలో దాడులు నిర్వహించింది తామేనని ఈ సంస్థ వివిధి వార్తా పత్రికలకు ఇమెయిల్స్ పంపింది.
Source: జాతీయ | 26 Nov 2008 | 10:22 pm

ఉగ్రవాదుల కాల్పుల్లో ఎటీఎస్ ఛీఫ్ మృతి

బుధవారం రాత్రి ముంబై పేలుడు ఘటనల సందర్భంలో ఓబెరాయ్ హోటల్లోకి దూసుకెళ్లిన ఉగ్రవాద నిరోధక దళం -ఎటీఎస్-పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎటీఎస్ అధిపతి హేమంత్ కర్కారే కన్నుమూశారు. తన సహచరులతో కలిసి ఓబెరాయ్ హోటల్లో అడుగు పెట్టిన హేమంత్ కర్కారే ఉగ్రవాదుల తుపాకీ తూటాలు తగిలి, ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో నేలకొరిగారు.
Source: జాతీయ | 26 Nov 2008 | 10:07 pm

ఉగ్రవాదుల కాల్చివేత: ఎన్‌కౌంటర్ నిపుణుడి మృతి

బుధవారం రాత్రి ముంబై నగరాన్ని వరుస పేలుళ్లతో వణికించిన టెర్రరిస్టులలో ఇద్దరిని ముంబై పోలీసులు మట్టుపెట్టారు. కాగా, ఉగ్రవాదులతో నేరుగా పోలీసులు తలపడిన ఘటనల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు విజయ్ సాలాస్కర్ నేలకొరిగారు. ఇంకా కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో ముంబై అదనపు పోలీసు కమిషనర్‌తో సహా పలువురు పోలీసులు మరణించారని, లేదా గాయపడ్డారని టీవీ వార్తలు.
Source: జాతీయ | 26 Nov 2008 | 8:35 pm

తాజ్, ఓబెరాయ్ హోటళ్లలో ఎన్‌కౌంటర్

దక్షిణ ముంబైలోని సంపన్న ప్ర్రాంతాల్లో బుధవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కనీసం 25 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. నగరంలో పేరొందిన స్టార్ హోటల్స్ ఓబెరాయ్, తాజ్, ట్రైడెంట్ హోటళ్లలో ఉగ్రవాదులు దూరి కాల్పులు ప్రారంభించారని తెలిపారు. నగరంలో కనీసం అయిదు చోట్ల పేలుళ్లు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది.
Source: జాతీయ | 26 Nov 2008 | 7:49 pm

పేలుళ్లతో దద్దరిల్లిన ముంబై: 16 మంది మృతులు

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో బుధవారం రాత్రి 10.30 గంటలకు సంభవించిన వరుస పేలుళ్ల ఘటనలో ఇంతవరకు 16 మంది మరణించగా మరో 50 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎకె-47 రైఫిళ్లు, గ్రెనేడ్‌లతో సిద్ధంగా వచ్చిన ఉగ్రవాదులు చత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వేస్టేషన్‌లోని ప్రయాణీకుల హాల్‌లోకి జొరబడి కాల్పులు జరిపి గ్రెనేడ్‌లు విసిరారని ముంబై జనరల్ రైల్వే పోలీస్ కమిషనర్ ఎకె శర్మ తెలిపారు.
Source: జాతీయ | 26 Nov 2008 | 7:14 pm

ముంబైలో ఉగ్రవాద దాడులు: 5గురి మృతి

బుధవారం రాత్రి దక్షిణ ముంబైలో విచక్షణారహితమైన కాల్పులు, పేలుళ్ల ఘటనలో 5 గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని ప్రాధమిక సమాచారం. ఏకకాలంలో జరిగిన ఈ ఘటనలను ఉగ్రవాదుల చర్యే అని పోలీసులు వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 26 Nov 2008 | 6:35 pm

ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధన : వైఎస్‌

తెలంగాణకు ప్రత్యక రాష్ట్ర హోదా కల్పించాలంటే అన్ని పార్టీల ఏకాభిప్రాయం ఉంటేనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2008 | 2:56 pm