అందమైన అబద్ధం ఆడియో ఆవిష్కరణ

రాజా, కామ్నా జఠ్మలానీ జంటగా నటించిన చిత్రం "అందమైన అబద్ధం". రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర నిర్మాతలు పిపి రెడ్డి, ఎం.కేశవరాజు, జొన్నాడ రమణమూర్తిలతోపాటు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 11:14 am

తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రం

ఆనంద్, షరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఓ ఉదయం.. ఓ సాయంత్రం". యీపూరి విజన్ పతాకంపై వర్మ ఎస్.యీపూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనూబాలక్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శనివారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 11:09 am

డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడు

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హన్సిక హీరోహీరోయిన్లుగా రూపొందిన "బిందాస్" చిత్రాన్ని తెలుగులో "పండుగాడు" పేరుతో జె.బాలరాజు అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. గురువారం డీటీఎస్
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 10:54 am

మెగాస్టార్ రెండో రోజు పర్యటన సక్సెస్

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప జిల్లాలో రెండో రోజు చేపట్టిన ప్రజా అంకిత యాత్ర విజయవంతంగా ముగిసింది. చిరు కడప జిల్లా పర్యటన ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. చిరు యాత్ర మాత్రం ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసు వర్గాలు, ఇటు పీఆర్పీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:49 am

28న ప్రేక్షకుల ముందుకు కుబేరులు

కృష్ణభగవాన్, అలీ, శివాజీ హీరోలుగా నటించిన "కుబేరులు" చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్‌కు "కానీ వాళ్లకన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను కూడా జోడించారు. ఫర్జాన్ కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. కరుటూరి
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 10:42 am

కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తి

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి మరోమారు నమ్మి మోసపోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనా రెడ్డి సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:40 am

సంక్షోభాన్ని అధిగమిస్తాం.. వృద్ధి సాధిస్తాం: ప్రధాని

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభావం భారత్‌పై ఉన్నప్పటికీ.. దీని నుంచి గట్టెక్కే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన నొక్కివక్కాణించారు. హిందూస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 21 Nov 2008 | 10:32 am

ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలం: ప్రధాని మన్మోహన్

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం భారత్‌‍పై పడకుండా చూసేందుకు అన్ని నివారణ చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించగలదని నమ్మకం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:32 am

డబుల్స్‌లోనూ సైనా ఓటమి: భట్ ముందంజ

చైనా ఓపెన్ సిరీస్‌లో ఇప్పటికే సింగిల్స్‌లో ఇంటిబాట పట్టిన సైనా నెహ్వాల్ డబుల్స్‌లోనూ నిష్క్రమించింది. అన్‌సీడెడ్‌గా బరిలో దిగిన సైనా- అన్నా రైస్ (కెనడా) జంట 13-21, 11-21 పాయింట్ల తేడాతో నాలుగో సీడ్ జంగ్ ఈన్- మింగ్ మిన్ జంగ్ కిమ్...
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:32 am

ఆసక్తికరంగా ఆసీస్-కివీస్ తొలి టెస్టు

బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజునే ఫలితం తేల్చే దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఆసీస్‌కు తమ బౌలర్ల...
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:31 am

జనవరిలో బీసీల ఆత్మగౌరవ సభ: అల్లు

బీసీల ఆత్మగౌరవ సభను జనవరిలో నిర్వహిస్తామని ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ తెలిపారు. వెనుకబడిన తరగతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేలా ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:30 am

సీఎంచే మత్స్యదర్శిని ప్రదర్శనశాల ప్రారంభం

హైదరాబాద్‌లో రూ. కోటీ యాభై లక్షలతో మత్స్యదర్శిని పేరుతో ఏర్పాటు చేసిన అలంకరణ చేపల ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలంకరణ చేపలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకై ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:30 am

సోమాలియా పేరేట్లపై ఆంక్షలకు ఐరాస ఆమోదం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) గురువారం సోమాలియా పైరేట్ల కోసం సిద్ధం చేసిన ఆంక్షలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమాలియా సముద్రపు దొంగలతోపాటు ఆయుధాల స్మగ్లర్లు, దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించేవారిపై
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:29 am

కడప దర్గాలో మెగాస్టార్ ప్రత్యేక ప్రార్థనలు

రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గాల్లో కడప దర్గా ఒకటి. ఈ దర్గాను దేశంలోని ప్రముఖులు, వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు సందర్శిస్తుంటారు. ఆ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా శుక్రవారం ఈ దర్గాను సందర్శించారు. తాను చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో భాగంగా.. ఆయన ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:29 am

సరళీకరణ విధానాలకు సోనియా గాంధీ ఓటు

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని దేశంపై పడకుండా చూసేందుకు సరళీకరణ విధానాలను జాగ్రత్తగా అమలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరళీకరణ
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:29 am

శ్రీనగర్‌లో కర్ఫ్యూ తరహా ఆంక్షల విధింపు

కాశ్మీర్ లోయలో అధికారిక యంత్రాంగం శుక్రవారం కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించింది. శ్రీనగర్‌లోని జామియా మసీదుకు వేర్పాటువాదులు నిరసన ర్యాలీని తలపెట్టడంతో అధికారిక యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. నిరసన ర్యాలీని
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:28 am

ఆ ప్రాజెక్టులో వైఎస్‌కు భారీగా ముడుపులు: బాబు

కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి వైఎస్‌కి వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. వైఎస్‌ నిర్వహిస్తున్న ధనయజ్ఞంలో ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఒక భాగమని బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:24 am

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ధోబి పోటి

జీవితాంతం పార్లమెంటు సభ్యుల బట్టలుతుకుతూ కాలం వెళ్ళబుచ్చడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. 32 సంవత్సరాల ముహమ్మద్‌తాహిర్ అనే ధోబి. ఇతను రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ అవెన్యు కాలనిలో పార్లమెంట్‌ సర్వెంట్స్ క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు.
Source: జాతీయ | 21 Nov 2008 | 9:39 am

తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఉత్తమం

తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌పై గట్టి నమ్మకముంటే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఉత్తమమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి సూచన చేశారు. కాంగ్రెస్‌లో విలీనం చేయడమో లేక పార్టీని రద్దు చేయడమే చేయవచ్చన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 7:29 am

టిబెట్ వివాదం: భారత్ సాయం కోరిన దలైలామా

భారత్, టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని "గురు- శిష్య బంధం"గా అభివర్ణించిన దలైలామా గురువారం టిబెట్ సమస్య పరిష్కారం కోసం భారత్ సాయాన్ని కోరారు. శిష్యుడు సమస్యల్లో ఉంటే, దాని నుంచి అతడిని రక్షించాల్సిన బాధ్యత గురువుపై
Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 7:23 am

రేపటి నుంచి కేసీఆర్ 'బస్సుయాత్ర'

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు శనివారం నుంచి తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి విడత యాత్రలో రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 7:14 am

వామపక్ష నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వామపక్ష నేతలైన ప్రకాష్ కారత్, ఏబి.బర్ధన్‌లతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వామపక్ష అగ్రనేతలతో విడివిడిగా జరిపే ప్రత్యేక భేటీలో దేశ రాజకీయ పరిస్థితులతో బాటు రాష్ట్ర పొత్తులపై కూడా చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 7:04 am

మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగం

దేశంలో పెనుసంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ళ కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర సమీకృత నేరాల చట్టం (మోకా)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం ప్రయోగించిన వారిలో ప్రజ్ఞాసింగ్‌తో సహా, మత గరువురు దయానంద్ పాండే, ఆర్మీ అధికారి ఒకరు ఉన్నారు. వీరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Source: జాతీయ | 21 Nov 2008 | 5:42 am

యురేనియం నిక్షేపాల అన్వేషణకు కృషి: కకోద్కర్

దేశంలో యురేనియం నిక్షేపాలు అపారంగా ఉన్నాయని భారత అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నిక్షేపాలను గుర్తించేందుకు పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం వచ్చే 11వ పంచవర్ష ప్రణాళిక లో రూ.800 కోట్లను కేంద్ర కేటాయించిందని ఆయన వివరించారు.
Source: జాతీయ | 21 Nov 2008 | 4:32 am

నవంబరు 21, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 3:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 3:09 am

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు డౌటే : నరేంద్ర

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం అనుమానమేనని టీఆర్ఎస్ (ఎన్) అధ్యక్షుడు నరేంద్ర పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ సానుకూల ప్రకటన చేయడమో, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడమో చేసే అవకాశాలే ఎక్కువని ఈ సందర్భంగా నరేంద్ర తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 11:21 pm

సైనికులూ సెల్‌ వాడకం తగ్గించండి : రామ్‌దేవ్

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో నిత్యం కాపలాకాసే సైనికులు సెల్‌ఫోన్ల వాడకాన్ని తగ్గించాల్సిందిగా ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. సైనికులు సెల్‌ఫోన్లను పదేపదే వాడడం వల్ల వారిలో ఆందోళన పెరిగి అది వారి వృత్తిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 20 Nov 2008 | 10:49 pm

రైతులకు కరెంట్ మర్చిపోవద్దు : సీఎం ఆదేశం

రాష్ట్రంలో విద్యుత్ కోసం ఏమేరకు డిమాండ్ పెరిగినా కూడా రబీ రైతులకు ఖచ్చితంగా ఏడుగంటలపాటు కరెంట్ ఇచ్చితీరాలంటూ మఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సెంటు భూమి ఎండిందనే అపవాదు తమ ప్రభుత్వానికి రాకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 10:32 pm

మాకు తెలియకుండా తెలంగాణపై నిర్ణయమా : వీహెచ్

ప్రత్యేక తెలంగాణ అంశంలో తమతో చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణపై అధిష్టానంలో చర్చ జరుగుతున్నా ఆరు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే దీనిపై మరింత స్పష్టమైన సంకేతాలు వెలువడనున్నాయని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2008 | 10:15 pm

ఆర్ధిక అత్యవసర పరిస్థితి రానుంది : అద్వానీ

దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోందని సరికొత్త వ్యూహాలతో, కృతనిశ్చయంతో ఎదుర్కోకుంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 20 Nov 2008 | 10:01 pm

రాహుల్ క్షమాపణ కోరలేదు : సిక్కుల విమర్శ

సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన ఘర్షణలు కచ్చితంగా తప్పేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చెప్పినా ఆ విషయంలో క్షమాపణ కోరకపోవడాన్ని సిక్కు సంఘాల నేతలు తప్పుబట్టారు. గాంధీ కుటుంబం చేసిన ఈ ఘోర తప్పిదానికి సిక్కు ప్రజలు ఎప్పటికీ వారిని క్షమించరని వారు పేర్కొన్నారు.
Source: జాతీయ | 20 Nov 2008 | 9:16 pm

మాలేగావ్ నిందితులపై మోకా చట్టం ప్రయోగం

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులగా పేర్కొంటూ మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేసినవారిపై మోకా చట్టం ప్రయోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన చేసింది.
Source: జాతీయ | 20 Nov 2008 | 9:16 pm