ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమే: శోభారాణి

సూర్య హీరోగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని ఎస్.వి.ఆర్ మీడియా అధినేత వెల్లడించారు. "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడదగ్గ సినిమాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తీర్చిదిద్దారని ఆమె...
Source: వినోదం | 17 Nov 2008 | 12:40 pm

చేనేతల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ అధికారలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమమే ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవి ప్రకటించారు. తాను సిరిసిల్లలో పర్యటించిన తర్వాతనే చేనేత కార్మికుల కష్టాలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 11:53 am

షాంఘై మాస్టర్స్ ఛాంపియన్ జకోవిచ్

రష్యా యోధుడైన నికోలాయ్ డావిడెంకోను చిత్తు చేయడం ద్వారా సెర్బియా స్టార్ క్రీడాకారుడు జకోవిచ్ షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఛాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జకోవిచ్ 6-1, 7-5 సెట్లతో డావిడెంకోపై విజయం సాధించాడు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:46 am

దమ్ముంటే ఆ పని చేసి చూడండి: వెంకయ్య

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)పై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:42 am

యువీ ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌కు మరో విజయం

తొలి వన్డేలో అద్భుత సెంచరీ చేసిన యువరాజ్‌ ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శించడంతో ఇండోర్‌లో సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 54 పరుగుల తేడాతో సునాయస విజయం సాధించింది. భారత్ నిర్ణయించిన 293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 238 పరుగులకే...
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:31 am

నేతన్నల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు

తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:30 am

కాంగ్రెస్, లెఫ్ట్ తప్ప ఎవరికైనా సై: బీజేపీ

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మినహాయించి మరే ఇతర రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అయితే భావసారూప్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:29 am

బెంగాల్‌లో కూలిన మిగ్- 23 శిక్షణ విమానం

భారత వైమానిక దళానికి చెందిన మిగ్- 23 శిక్షణ విమానం ఒకటి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. గత వారం రోజుల్లో మిగ్- 23 విమానం కూలిపోవడం ఇది రెండోసారి. రోజువారి శిక్షణపై ఉన్న ఈ విమానం మధ్యాహ్నం
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:27 am

ఎల్టీటీఈ కీలక స్థావరానికి చేరువలో లంక దళాలు

శ్రీలంక వైమానిక దళ యుద్ధవిమానాలు వేర్పాటువాద ఎల్టీటీఈ పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేశాయి. ఇదిలా ఉంటే ఎల్టీటీఈకి చెందిన మరో కీలక స్థావరానికి శ్రీలంక దళాలు సమీపిస్తున్నాయని ఆర్మీ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 11:20 am

చిరంజీవి రోడ్‌షోలో తొక్కిసలాట: ఇద్దరి మృతి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన రోడ్‌షోలో తొలిసారి అపశృతి దొర్లింది. తన మూడో విడత ప్రజాఅంకిత యాత్రలో భాగంగా చిరంజీవి అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి ఆదివారం యాత్రను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా సోమవారం ధర్మవరంలో రోడ్‌షోను నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:56 am

డిసెంబర్‌లో తానా చైతన్య స్రవంతి ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి-2008 సాంస్కృతిక ఉత్సవాలను డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 20-27 తేదీల మధ్య వీటిని ఏలూరు, విజయవాడ, తెనాలి, హైదరాబాద్‌లలో నిర్వహించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 10:44 am

విశాఖలో 31 మంది మావోయిస్టుల లొంగుబాటు

రాష్ట్రంలో ఇప్పటికే తమ పట్టు కోల్పోయిన మావోయిస్టులకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు కమాండర్లతో పాటు ఏకంగా 31 మంది మావోయిస్టులు విశాఖపట్నం పోలీసులకు లొంగి పోయారు. వీరిలో ఆరుగురు కమాండర్లతో సహా ముగ్గురు డిప్యూటీ కమాండర్లు, మరికొంత మంది సానుభూతిపరులు కూడా ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:24 am

వారు తప్ప.. ఎవరైనా ఓకే : దత్తాత్రేయ

రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మినహా, వేరే ఏ ఇతర పార్టీలతోనైనా సరే... తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:23 am

రుణమాఫీ వల్ల ప్రయోజనం నిల్ : కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా, దానివల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:06 am

"జింబో" కార్యవర్గాన్ని ప్రకటించిన తెరాస

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు 203 మంది సభ్యులతో కూడిన జింబో కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. తెరాస పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో... 39మంది ఉపాధ్యక్షులు, 23 మంది ప్రధాన కార్యదర్శులు, 109 మంది కార్యదర్శులు, 32 మంది సంయుక్త కార్యదర్శులతో కూడిన భారీ లిస్టును ఆయన వెల్లడి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:04 am

బాబ్లీ ప్రాజెక్టును సందర్శిస్తున్న తెదేపా బృందం

సుప్రీం కోర్టు ఉత్తర్వులను తోసిరాజని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రత్యేక బృందం సందర్శిస్తోంది. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం 11 ప్రాజెక్టులను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ నిర్మాణాలను తక్షణం నిలుపుదల చేయాలంటూ తెదేపా బృందం ఔరంగాబాద్‌ చేరుకుంది.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2008 | 10:00 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 9:24 am

భారీ జాబితాతో తెరాస కార్యవర్గం

తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ జాబితాతో కార్యవర్గాన్ని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ సోమవారం నియమించారు. ఈ కార్యవర్గంలో 22 మంది ఉపాధ్యక్షులు, 30 మంది ప్రధాన కార్యదర్శులు, 106 మంది కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2008 | 8:55 am

పురోహిత్‌ వద్ద హర్యానా రైల్వే పోలీసుల విచరాణ

మాలేగావ్ పేలుళ్ళ కేసులో అరెస్టయిన లెఫ్టినెంట్ కల్నల్ పీఎస్.పురోహిత్ వద్ద హర్యానా రైల్వే పోలీసులు ఆదివారం విచారణ జరిపారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుకు సంబంధించిన ఈ విచారణ సాగినట్టు రైల్వే పోలీసు అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 17 Nov 2008 | 7:38 am

న్యూఢిల్లీకి చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు

మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ సోమవారం భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానశ్రయంలో దిగిన ఆయనకు కేంద్ర జలవనరుల శాఖామంత్రి సైఫుద్దీన్ సౌజ్ సాదర స్వాగతం పలికారు.
Source: జాతీయ | 17 Nov 2008 | 7:12 am

చంద్ర, అంగారక యాత్రలపై కలాం స్వప్నం

చంద్రుడిపై, అంగారక గ్రహంపై రోదసీయాత్రికులు తిరుగాడే అరుదైన క్షణాలను తాను ప్రస్తుతం కలగంటున్నానని మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పేర్కొన్నారు. భారతీయ తొలి మానవరహిత ఉపగ్రహం చంద్రయాన్-1 పరిశోధనతో సన్నిహితంగా ముడిపడిఉన్న కలాం... బారతీయ త్రివర్ణ పతాకం చంద్రుడిని ముద్దాడే కమనీయ దృశ్యం దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పారు.
Source: జాతీయ | 17 Nov 2008 | 6:31 am

కంధమాల్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం

మత ఘర్షణలతో అట్టుడుకి పోయిన ఒరిస్సా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో నలుగురు మంత్రులతో కూడిన కేంద్ర బృందం సోమవారం పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఏర్పాటైన బృందంలో టీఆర్‌.బాలు, పీఆర్‌.ఖిండియా, మీరా కుమార్‌లు ఉన్నారు.
Source: జాతీయ | 17 Nov 2008 | 5:53 am

జమ్మూ-కాశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభం

జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం తొలి విడత పోలిగ్ ప్రారంభమైంది. ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది.
Source: జాతీయ | 17 Nov 2008 | 5:05 am

పెళ్ళిళ్ళే ఉండవు

"ఆడా, మగా కాస్తంత తెలివితేటల్తో ప్రవర్తిస్తే కాపురాల్లో అసలు కలతలే ఉండవు. విడాకులు అసలే ఉండవు..." చెప్పాడు సుందరం...
Source: వినోదం | 17 Nov 2008 | 4:46 am

ఏమైనా బాగుందా..?

"నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా..?" కూతుర్ని అడిగాడు గజదొంగ గంగులు...
Source: వినోదం | 17 Nov 2008 | 4:44 am

నిఘా నీడలో జమ్మూకాశ్మీర్ బ్యాలెట్ పోరు

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ సోమవారం జరుగనుంది. మొత్తం 87 అసెంబ్లీ స్థానాల్లో తొలివిడతగా పది స్థానాలకు పోలింగ్‌ ఆరంభమవుతుంది. ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చనే సందేహాల నడుమ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది.
Source: జాతీయ | 17 Nov 2008 | 4:08 am

నవంబరు 17, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2008 | 3:54 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2008 | 3:53 am