ఆర్మీ అస్పత్రి నుంచి సోమనాథ్ డిశ్చార్జ్

లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆస్పత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతిలో ఉండాలని సోమనాథ్‌కు డాక్టర్లు సూచించారు.
Source: జాతీయ | 8 Nov 2008 | 9:10 am

రేపు అర్పణ మృతదేహం రాజధానికి రాక

అమెరికాలో అశువులు బాసిన విద్యాకుసుమం అర్పణ భౌతికకాయం ఆదివారం అర్థరాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రానుంది. అమెరికాలోని సీయాటెల్‌ పట్టణ శివార్లలో ఉన్న రెడ్‌మండ్‌ ప్రాంతంలో అర్పణ హత్యకు గురైన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 7:22 am

పీఆర్పీ నేతలతో రాయలసీమ నేతల భేటీ

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేతలతో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాయలసీమ పర్యటన ఖరారైన నేపథ్యంలో వీరి సమావేశం జరగడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 7:13 am

కోస్టల్ కారిడార్‌ను రద్దు చేసిన ప్రభుత్వం

కోస్టల్‌ కారిడార్ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఈ కారిడార్‌కు పార్టీలకతీతంగా గళం విప్పిన ప్రతిపక్ష పార్టీలు శనివారం ప్రభుత్వంపై నైతిక విజయాన్ని కైవసం చేసుకున్నాయి. కోస్టర్ కారిడార్‌ నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జీవోను వైఎస్ సర్కారు రద్దు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 7:00 am

రూటు మారుతున్న రాష్ట్ర రాజకీయాలు

రాష్ట్రంలో మహాకూటమి ఏర్పాటుకు అధికార కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెరాస, సీపీఐ తదితర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు సీపీఐ నేతలు కృషి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2008 | 6:27 am

ఎంపీల రాజీనామా 'రాజకీయ' ఎత్తుగడ: పాశ్వాన్

బీహార్‌కు చెందిన అధికార జనతాదళ్ (యు) పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేయడాన్ని లోక్‌జనశక్తి అధినేత, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తప్పుపట్టారు. ఎంపీల రాజీనామా రాజకీయ ఎత్తగడగా అభివర్ణించారు.
Source: జాతీయ | 8 Nov 2008 | 5:07 am

పేలుళ్లు: మరికొందరు ఆర్మీ అధికారుల హస్తం!

మహారాష్ట్రంలోని మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ళ వెనుక మరికొందరు సైనికాధికారుల హస్తం ఉన్నట్టు ముంబై తీవ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అనుమానం వ్యక్తం చేసింది. దీంతో సందేహంగా ఉన్న ఆర్మీ అధికారులను ఏటీఎస్ విచారించాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 8 Nov 2008 | 4:55 am

రాటుదేలిన హిందుత్వవాది.. అద్వానీ

లాల్ కృష్ణ అద్వానీ.. భారతీయ జనతా పార్టీకి వెన్నెముక. అధికారం కోసం రామనామజపం చేసే రామభక్తుడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా వామపక్షాల నుంచి నిత్యం విమర్శలు ఎదుర్కొనే నేత.
Source: జాతీయ | 8 Nov 2008 | 4:33 am

కేంద్రీయ వర్సిటీలకు భారీగా నిధులు : ప్రభుత్వం

కేంద్రీయ వర్సిటీలకు భారీ నిధులు : ప్రభుత్వంవచ్చే పంచవర్ష ప్రణాళికలో భాగంగా కేంద్రీయ వర్సిటీలకు భారీ నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని మొత్తం 24 కేంద్రీయ విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధి కోసం 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ నిధులను మంజూరు...
Source: జాతీయ | 7 Nov 2008 | 11:37 pm

హాహాకారాలు... ఆర్తనాదాలే యువగర్జన : పీఆర్పీ

పార్టీలో తిరిగి పునరుత్తేజాన్ని నింపే దిశగా తెలుగుదేశం పార్టీ గుంటూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగర్జనపై ప్రజారాజ్యం పార్టీ విమర్శల బాణాలు సంధించింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో మునిగిపోతున్న పడవను తలపించేలా సాగిన యువగర్జన గురించా గొప్పలు అంటూ...
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 10:51 pm

'ఏనుగు'తో యవ్వారం : చిక్కుల్లో యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాజాగా జంతు ప్రేమికుల కోపానికి గురయ్యారు. కేరళలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి యడ్యూరప్ప ఓ ఎనుగును బహుకరించడంపై త్రిస్పూర్‌కు చెందిన ఎలిఫెంట్ లవర్స్ అసోసియేషన్ (ఈఎల్ఏ) మండిపడుతోంది. ఆలయానికి ఏనుగును బహుకరించే విషయంలో...
Source: జాతీయ | 7 Nov 2008 | 10:08 pm

'స్వలింగ సంపర్కం' నేరమా... ? : విచారణ వాయిదా

ప్రస్తుత పరిస్థితుల్లో స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్న అభ్యంతరాలను తదుపరి విచారణ సమయానికి సమర్పించాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
Source: జాతీయ | 7 Nov 2008 | 7:18 pm

'ఐరాస' నుంచి 'నాయుడు' గారికి ఆహ్వానం

న్యూయార్క్ వేదికగా జరగనున్న ఐక్యరాజ్యసమితి 63వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఎనిమిదిమంది సీనియర్ సభ్యులతో కూడిన భారత పార్లమెంటరీ బృందం హాజరుకానుంది. ఈ బృందంలో టీడీపీ పార్లమెంటరీ నేత ఎర్రన్నాయుడు కూడా ఓ సభ్యుడు కావడం విశేషం.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 5:51 pm

ఒరిస్సా కేంద్రంగా ఆంధ్ర మావోయిస్టుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మావోయిస్టులను ఒరిస్సా రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఒరిస్సాలోని కలిమెల అటవీ ప్రాంతంలో ఒకిల్‌కొండ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులకు పట్టుబడిన ఈ మావోయిస్టులు ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులోని...
Source: జాతీయ | 7 Nov 2008 | 4:30 pm

వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెదేపాదే : బొత్సా

సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబుదేనని శుక్రవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 12:24 pm

కాంగ్రెస్ పార్టీది మెతక వైఖరి: దత్తన్న

ఉగ్రవాదం అణిచివేతలో కాంగ్రెస్ పార్టీ మెతకవైఖరిని అవలంభిస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతిలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ కీలుబొమ్మగా మారారని ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 12:22 pm

బాంబు పేలుళ్లు: ఆర్మీ పాత్రపై ఆంటోనీ ఆరా

మాలేగావ్‌లో సంభవించిన బాంబు పేలుళ్ళపై సైనిక అధికారుల పాత్ర ఉండటం పట్ల కేంద్ర రక్షణ శాఖ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్మీ అధికారుల పాత్రపై మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక పోలీసు బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్య తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోని హెచ్చరించారు.
Source: జాతీయ | 7 Nov 2008 | 12:13 pm

లాభాల బాటలో సెన్సెక్స్: 230 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో నడిచింది. అమెరికా మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 103 పాయింట్లు వృద్ధి చెంది 9,631 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం లాభాల్లోకి అడుగుపెట్టింది. ఒకానొక దశలో సెన్సెక్స్
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:54 am

ఏజెన్సీల్లో మావోయిస్టుల బంద్‌తో అస్తవ్యస్తం

ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్‌తో శుక్రవారం పౌరజీవనానికి అంతరాయం ఏర్పడింది. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్లకు నిరనసగా మావోయిస్టు పార్టీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:51 am

డబ్బింగ్ జరుపుకుంటోన్న మళ్లీ మళ్లీ

స్కంద, కళ్యాణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "మళ్లీ మళ్లీ". రాజ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతున్నామని దర్శకుడు
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:43 am

నేతల అరెస్టుకు నిరసనగా టీడీపీ ధర్నాలు

ముఖ్యమంత్రి వైఎస్‌కు విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:42 am

తెదేపా నేతల ఫోన్లు ట్యాపింగ్: చంద్రబాబు

రాష్ట్రంలోని వైఎస్ సర్కారు తనతో పాటు తమ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరులో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యువగర్జన విజయవంతమైందన్నారు. వైఎస్ సర్కారు అవినీతిమయంలో కూరుకుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 11:36 am

ఓ.. ఉదయం, ఓ.. సాయంత్రం ప్రారంభం

"కాశీపట్నం చూడరాబాబూ!" ఫేమ్ ఆనంద్ హీరోగా, డేంజర్ ఫేమ్ "షెరేన్" హీరోయిన్‌గా నటిస్తున్న ఓ.. ఉదయం.. ఓ సాయంత్రం చిత్ర షూటింగ్ లాంఛనంగా ఇటీవల ప్రారంభమైంది. మళయాళ దర్శకుడు తనుబాలక్ ఈ సినిమా దర్శకుడు. వర్మ ఎస్.ఏపూరి నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:35 am

నిద్రమత్తులో ప్రభుత్వ అధికార గణం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా.. నగర శివారు ప్రాంతంలోని పారిశ్రామికవాడ జీడిమెట్లలో ఈ ప్రమాదాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ఇక్కడ ఉండే కంపెనీల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అతి ప్రమాదకరమైన రసాయనాలను గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2008 | 11:33 am

నెల్లూరు మేయర్ తొలగింపుపై హైకోర్టు ఆదేశం

నెల్లూరు మేయర్ శైలజారెడ్డిని తొలగించేందుకు చూపిన కారణాలు సరిగ్గాలేనందున ఆమెకు తాజా నోటీసు పంపాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. దీనికి ఆమె రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 11:24 am

రెండో షెడ్యూల్‌లో శబరి గిరీశా అయ్యప్ప

శ్రీ పద్మనాథ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వంలో పి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". ఈ సినిమాకు రమణే నిర్మాత. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శివాజీరాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2008 | 11:12 am

ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకుంటాం: ఆంటోనీ

మాలేగావ్ పేలుడులో ఆర్మీ అధికారి పాత్ర ఉందనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ ఆరోపణలు నిర్ధారించబడితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఆర్మీ అధికారిపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని
Source: Yahoo! Telugu: News | 7 Nov 2008 | 10:45 am