ఢిల్లీ చేరిన తెలంగాణం : 24న లోక్‌సభలో చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న ప్రత్యేక తెలంగాణ వ్యవహారం తాజాగా ఢిల్లీ చేరింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ అంశం శుక్రవారం నాడు చర్చకు రానుంది. బీజేపీ ఇచ్చిన ప్రైవేటు తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆమెదం తెలపడంతో 24న లోక్‌సభలో...
Source: జాతీయ | 22 Oct 2008 | 10:02 am

పొన్నాలచే మహానగరంలో ఆడియో ఆవిష్కరణ

రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య "మహానగరంలో" చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. శ్రీవాసవి విజువల్స్ పతాకంపై ఓంనమ:శివాయ ఎర్రం ఈ చిత్రాన్ని నిర్మించారు. యశ్వంత్, విజయభాస్కర్ హీరోలు. పూనమ్ సింగార్ హీరోయిన్
Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2008 | 9:43 am

రాజశేఖర్ సరసన లారా దత్త!

డాక్టర్. రాజశేఖర్ తాజా సినిమా "సత్యమేవ జయతే..!"లో బాలీవుడ్ సెక్సీక్వీన్ లారా దత్త నటించబోతుందట. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన లారా దత్త రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ... అసలు విషయమేమిటంటే...? లారా దత్త...
Source: వినోదం | 22 Oct 2008 | 9:39 am

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది : నాయర్

చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇది చారిత్రాత్మకమైన విజయమని ఆయన అభివర్ణించారు. చంద్రయాన్ ప్రయోగం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనీ, ఈ కలను సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ నాయర్ సెల్యూట్ చేశారు...
Source: జాతీయ | 22 Oct 2008 | 7:27 am

కొత్తగా 1500 ఐటీఐలు : ఆస్కార్ ఫెర్నాండెజ్

దేశం మొత్తంలో కొత్తగా మరో 1500 పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)లను ఏర్పాటు చేయనున్నట్టు కార్మిక మరియు ఉపాధి మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
Source: జాతీయ | 22 Oct 2008 | 7:26 am

ఇస్రోశాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం

చంద్రయాన్-1 విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 7:20 am

వామపక్ష నేతల ఉమ్మడి సమీక్ష

తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై బుధవారం వామపక్షాల కార్యదర్శులు ఉమ్మడిగా సమీక్ష నిర్వహించనున్నారు. సీపీఎం కార్యాలయంలోజరుగనున్న ఈ సమావేశంలో, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు భేటీ కానున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 7:13 am

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమ్మె

ఉపాధ్యాయులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉపాధ్యాయులు బుధవారం సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులందరూ మమేకమై నేడు (బుధవారం) సమ్మెకు దిగారు
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 7:05 am

కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది : బాబు

వచ్చే ఎన్నికల్లో 200 స్థానాలు దక్కుతాయని కాంగెస్ పార్టీ కలలు కంటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన ఆయన పార్టీ స్థితిగతులపై సమీక్షించారు
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 7:02 am

వాళ్లను మోసం చేస్తాను గానీ?

"నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ ప్రేమించట్లేదుగా.." అడిగింది ప్రియురాలు...
Source: వినోదం | 22 Oct 2008 | 6:27 am

నీకు పెళ్ళెప్పుడు?

"డార్లింగ్..! నీకు రోజూ ఐస్‌క్రీములు, టిఫిన్లు కొనిపెడ్తున్నాను కదా... కానీ నువ్వు ఒక్కరోజు కూడా పెళ్ళి గురించి మాట్లాడవేం..?" అడిగాడు సుమన్...
Source: వినోదం | 22 Oct 2008 | 6:23 am

చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం

యావద్భారతావని ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ సీ11 రాకెట్ బుధవారం ఉదయం సరిగ్గా 6,22 గంటల సమయంలో నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లింది.
Source: జాతీయ | 22 Oct 2008 | 4:43 am

నందమూరి యువగర్జనకు సర్వం సిద్ధం

గుంటూరు వేదికగా నవంబర్ 5న జరగనున్న యువగర్జన కార్యక్రమానికి తెలుగుదేశం శ్రేణులు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. గుంటూరు యువగర్జనలో ప్రధాన ఆకర్షణ కానున్న నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమం కోసం తాజాగా ఫోటో సెషన్ కూడా పూర్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Oct 2008 | 4:31 am

అక్టోబరు 22, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు
Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2008 | 3:19 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2008 | 3:17 am

ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు: రాహుల్ గాంధీ

తన తండ్రి రాజీవ్‌గాంధీ హత్య జరిగి 17 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ ఈ కేసులో తనకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాజీవ్ తనయుడు ఎంపీ రాహుల్ గాంధీ వాపోయారు. తన తండ్రిని చంపిన వారిలో కొందరికి విధించిన ఉరిశిక్ష ఇన్నేళ్ల తర్వాత కూడా అమలు కాలేదని రాహుల్ విచారం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 21 Oct 2008 | 8:03 pm

ఇంఫాల్ పేలుడులో 17కి పెరిగిన మృతులు

ఇంఫాల్ నగరాన్ని కంపింపజేసిన బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శక్తివంతమైన బాంబుపేలుడు ధాటికి పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 21 Oct 2008 | 6:36 pm

మణిపూర్‌ బాంబుపేలుడులో 11 మంది మృతులు

మంగళవారం సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శక్తివంతమైన బాంబు పేలుడు ఘటనలో కనీసం 11 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. పోలీసు కమాండో శిక్షణా కేంద్రం ఉన్న అత్యున్నత భద్రతా జోన్‌లో మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు బాంబు పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 21 Oct 2008 | 5:11 pm

సైన్యం సమస్యలు ప్రభుత్వానికి తెలుసు: రాష్ట్రపతి

భారత సైన్యం ఎదుర్కొంటున్న సమస్యలు జాతికి స్పష్టంగా తెలుసని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చెప్పారు. సైన్యానికి మరిన్ని సౌకర్యాలు అందించే విషయమై భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అప్పుడే జాతీయ ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో సైన్యం కృత నిశ్చయంతో పోరాడగలదని రాష్ట్రపతి పేర్కొన్నారు.
Source: జాతీయ | 21 Oct 2008 | 4:39 pm

మందుబాబుల నోటికి తాళం...

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న పలు రోడ్డు ప్రమాదాలకు మూల కారణం మద్యపానం సేవించి వాహనాన్ని నడుపుతున్నవారే అని తేలింది. దీంతో పోలీసులు మందు బాబుల ఆటలను కట్టించేందుకు దృష్టి సారించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 3:00 pm

పరువును బజారుకీడ్చారు : తెదేపా

కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి.హనుమంత రావు, లగడపాటి రాజ్ గోపాల్ ఇరువురు పార్లమెంట్ సెంటర్ హాలులో తగదా పడి తెలుగువారి పరువును బజారు కిడ్చారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 2:57 pm

ఎన్ని పిట్టల్ని కొట్టాడు.. సిన్ని నాయనా...

ఖండాంతరాలను దాటి పొట్ట నింపుకునేందుకు వచ్చిన వలస పక్షులను వల పన్ని పడుతున్నారు కొందరు వ్యక్తులు. మార్కెట్లకు తరలించి వలస పక్షుల కిలకిల రావాల గొంతుకలను నులిమివేస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాలకు ప్రతి ఏటా లక్షల విదేశీ పక్షులు...
Source: వినోదం | 21 Oct 2008 | 1:13 pm

స్వర్ణకారులతో సీఎం భేటీ

స్వర్ణకారుల ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. పావలా వడ్డీకే రుణాలు అందించాలని స్వర్ణకారుల ప్రతినిధులు సీఎంను కోరారు
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 1:12 pm

అక్రమ రవాణా కేసు : ఎంపీపై లోక్‌సభ వేటు

మనుషుల అక్రమ రవాణాకు పాల్పడిన నేరంపై ఓ ఎంపీని లోక్‌సభ నుంచి బహిష్కరిస్తూ లోక్‌సభలో నిర్ణయం తీసుకున్నారు. తన పాస్‌పోర్ట్‌పై వేరే వ్యక్తులను విదేశాలకు తరలించేందుకు ఈ ఎంపీ ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.
Source: జాతీయ | 21 Oct 2008 | 12:33 pm

30నుంచి మలివిడత "మెగా" యాత్ర

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మలి విడత "ప్రజా అంకిత యాత్ర" ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 12:00 pm

బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశాం : కృష్ణారెడ్డి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బియ్యానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యాన్ని చౌక ధరకే అందిస్తున్నామని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2008 | 12:00 pm

రాజ్‌కు బెయిల్ నిరాకరణ : కస్టడీకి తరలింపు

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధినేత రాజ్‌థాకరేకు బాంద్రా కోర్టులో చుక్కెదురైంది. రాజ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాల్సిందిగా ఆదేసింది.
Source: జాతీయ | 21 Oct 2008 | 11:59 am

ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాల్లో కాలచక్రం

నవనీత్‌కౌర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "కాలచక్రం". అమ్మాభవాని క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ దర్శకత్వంలో ఎన్.అనిల్, ఎన్.గోవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 11:07 am

నాగబాబు ఏక్‌పోలీస్ విడుదలకు సిద్ధం

నాగబాబు ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న "ఏక్ పోలీస్" చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత ఎన్.హెచ్. భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. సమాజంలో చెడును
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:44 am

బ్లేడ్‌బాబ్జీకి క్లీన్‌యు సర్టిఫికేట్

నరేష్, సయాలిభగత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "బ్లేడ్‌బాబ్జీ". దొంగ అవసరార్థం పోలీసు బాధ్యతలు నిర్వర్తిస్తే ఎన్ని వింతలు జరుగుతాయో వినోదాత్మకంగా తెలియజెప్పే చిత్రమే "బ్లేడ్‌బాబ్జీ" అని దర్శకుడు దేవీప్రసాద్ తెలిపారు. సత్యమూవీస్ పతాకంపై
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:38 am

నా అనేవాడు సినిమా తొలికాపీ సిద్ధం

రాజీవ్ కనకాల, హరీష్, తనూజ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నా అనేవాడు". నిస్వార్థపరులైన ఇద్దరు స్నేహితుల మధ్య చిన్నపాటి మనస్పర్ద వస్తే వారేం చేశారు.. ఆ తేడా ఏమిటి... అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌కు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:32 am

గౌతమ్, శ్రీదేవి జంటగా మంజీర

గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగుతుంది. హిందూ, ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను అందమైన ప్రేమకావ్యంగా మలుస్తున్నామని నిర్మాత మోతుకూరి సాంబశివరావు తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2008 | 10:21 am

దీపావళికి ఎనిమిది ప్రత్యేక రైళ్లు

దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్- విశాఖపట్నంల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ 26, 27, 31, నవంబర్1 తేదీలలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు...
Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 10:16 am

సామాజిక న్యాయం కోసమే చిరు ప్రవేశం

సామాజిక న్యాయం ధ్యేయంతోనే చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భావితరాలకు సామాజిక న్యాయం అందించడమే తమ పార్టీ ఆశయమని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 10:10 am

పోలీసుపై దాడి కేసులో చారికి 6నెలల జైలు

పోలీసు కానిస్టేబుల్‌పై దాడి జరిపిన కేసులో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారికి నిజామాబాద్ సెషన్స్ కోర్టు మంగళవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ. 500లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2008 | 9:52 am