సూరత్‌లో మరో బాంబు లభ్యం: నిర్వీర్యం

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఆదివారం మరో బాంబు లభ్యమైంది. బాంబు నిర్వీర్య బృందం ఈ బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ బాంబుతో సహా సూరత్‌లో ఇప్పటి వరకు లభ్యమైన బాంబుల సంఖ్య 23కు చేరుకుంది.
Source: జాతీయ | 3 Aug 2008 | 11:57 am

నైనిటాల్‌ నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ జిల్లాలోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరింగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది భక్తజన సమూహం మధ్య తొక్కిసలాట జరిగడంతో వందమందికి పైగా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అలాగే.. మరో 300 మందికి పైగా గాయపడినట్టు అంచనా.
Source: జాతీయ | 3 Aug 2008 | 11:47 am

పత్రికా విలేకరులకు ఆరోగ్య శ్రీ: వైఎస్

రాష్ట్రంలోని జర్నలిస్టులకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. సమాజంలోని పలు సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు వ్యవస్థ ప్రక్షాళనకు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Aug 2008 | 11:41 am

నేడు గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై విచారణ

గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంపై రైల్వే భద్రతా చీఫ్ కమిషనర్ ఆర్పీ అగర్వాల్ ఆదివారం బహిరంగ విచారణ జరుపనున్నారు. సికింద్రాబాద్-కాకినాడల మధ్య నడిచే గౌతమి ఎక్స్‌ప్రెస్ ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 3 Aug 2008 | 6:42 am

ఎరువుల కొరతపై 5న సమీక్ష: కేంద్రమంత్రి

దేశ వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల కొరతపై వచ్చే ఐదో తేదీన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ఎరువుల రసాయనాల శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న ఎరువుల కొరతపై తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) నేతలు మంత్రి పాశ్వాన్‌తో భేటీ అయ్యారు.
Source: జాతీయ | 3 Aug 2008 | 5:56 am

నదిలో పడిన ట్రక్కు: 35 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమంది కూలీలలో వెళుతున్న ట్రక్కు ఒకటి అదుపుతప్పి నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా మరణించారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Source: జాతీయ | 3 Aug 2008 | 5:45 am

నేడు సుర్జీత్ అంత్యక్రియలు: అగ్రనేతల హాజరు

కమ్యూనిస్టు కురువృద్ధుడు దివంగత నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. నిగంబోధ్ ఘాట్‌లోని విద్యుత్ దహనవాటికలో సాయంత్రం ఐదు గంటలకు ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Source: జాతీయ | 3 Aug 2008 | 5:24 am

ఆగస్టు 03, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2008 | 4:46 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 3 Aug 2008 | 4:41 am

వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలి: కలాం

వ్యవసాయ అభివృద్ధికి శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు కలిసి కృషిచేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. మన దేశం వ్యవసాయ రంగంలో నాలుగు శాతం పెంపును సాధించినట్లైతే 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశాల...
Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:36 pm

మృతదేహాల అవశేషాలకు డిఎన్ఏ పరీక్షలు

గౌతమి ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన 29 మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసే నిమిత్తం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. వీటితో పాటు మరో రెండు మృతదేహాలను అధికారులు...
Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:34 pm

'చిరు' పార్టీకి పాటుపడుతా : జోగయ్య

రానున్న ఎన్నికల్లో సినీనటుడు చిరంజీవి స్థాపించనున్న కొత్త పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని నర్సాపురం లోక్‌సభ సభ్యుడు,కాంగ్రెస్ సీనియర్ నేత హరిరామ జోగయ్య ప్రకటించారు. ఆయన శనివారం నర్సాపురంలో...
Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:31 pm

తెదేపాతో పొత్తు అవకాశవాదం కాదు: నారాయణ

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అవకాశవాదం కాబోదని సి.పి.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీతో కొన్ని విభేదాలున్నప్పటికీ, సీపీఐ అధిష్టానం ఆదేశిస్తే ...
Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 1:27 pm

చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు. చిన్ననాటి స్నేహితుల కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 12:47 pm

అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదల

అభినయశ్రీ ముఖ్య పాత్రలో నటిస్తోన్న భైరవి చిత్రం ఆడియో శుక్రవారం విడుదలైంది. ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతథి సి. కళ్యాణ్ చేతులమీదుగా ఈ ఆడియో విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 12:20 pm

పూరీ దర్శకత్వంలో రవితేజ

రవితేజ, శ్రియ జంటగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నేనింతే. యూనివర్శల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై 21 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Aug 2008 | 12:14 pm

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం : 32కు చేరిన మృతుల సంఖ్య

గౌతమి ఎక్స్‌ప్రెస్‌ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా కేసముద్రం-మహబూబాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య తాళ్లపూస పల్లి సమీపంలో వెళ్తుండగా అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 2 Aug 2008 | 11:11 am

ఆగస్టు రెండో వారంలో "అంకుశం" ఆడియో

షాఖ్య సెల్యూలాయిడ్ పతాకంపై శ్రీనాథ్, రితీష్, సంగీత, కీర్తిచావ్లా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "అంకుశం". ఈ సినిమా ఆడియో ఆగస్టు రెండో వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత దర్శకుడు కె. విజయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. మాఫియా ముఠాలో చిక్కుకున్న...
Source: వినోదం | 2 Aug 2008 | 11:00 am

గౌతమీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై 4,5 తేదీల్లో బహిరంగ విచారణ

గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ నెల 4,5 తేదీల్లో కేసముద్రం వద్ద బహిరంగ విచారణ జరుపుతామని రైల్వే భద్రత ఉన్నతాధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:58 am

ఎల్టీటీఈతో పొంచి ఉన్న ప్రమాదం : శ్రీలంక ఆందోళన

తమదేశంలోని తమిళ వేర్పాటువాద తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ కారణంగా ముప్పు పొంచి ఉందని శ్రీలంక పేర్కొంది. శ్రీలంక స్థావరంగా పనిచేస్తున్న ఎల్టీటీఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖయిదాతో చేతులు కలిపి భారీ విధ్వంసాలకు...
Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:53 am

ఆగస్ట్ 11నుంచి కందిపప్పు, పామాయిల్ సరఫరా

రాష్ట్రంలో ప్రారంభమైన చౌకధర కందిపప్పు, పామాయిల్‌ను ఆగస్ట్ 11 నుంచి సరఫరా చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. రేషన్ షాపులకు సరఫరా చేయాల్సిన పామాయిల్ కోటా తగినంత మొత్తంలో అందుబాటులో లేని...
Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:49 am

రానున్న రెండు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణశాఖ పేర్కొంది. ఆగస్టు మూడున బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడే సూచన ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు...
Source: Yahoo! Telugu: News | 2 Aug 2008 | 10:46 am