కాంగ్రెస్-తెరాస ముఖాముఖి "ఢీ": డీఎస్

రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని పిసిసి అధ్యుక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2008 | 6:43 am

పేదలకు అందని ఆర్థిక ఫలాలు: బాబు

దేశంలో అమలవుతున్న ఆర్థిక సంస్కరణల ఫలాలు పేదల ప్రజలకు అందడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2008 | 6:33 am

మార్చి 30, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2008 | 5:24 am

లోక్‌సత్తా ప్రచార యాత్ర

'లోక్‌సత్తా ప్రచార యాత్ర' మార్చి 31 నుంచి ప్రారంభించనున్నట్లు లోక్‌సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి వర్మ వెల్లడించారు. సమాజంలో అగాధంలా పేరుకు పోతున్న అవినీతి జాడ్యాన్ని పెకలించేందుకు ఈ ప్రచార యాత్రను చేపడుతున్నామని వర్మ పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 2:01 pm

వైభవంగా తెదేపా వేడుకలు

తెలుగుదేశం పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2008 | 1:36 pm

ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం: ఎన్టీఆర్‌కు నివాళులు

పార్టీ 27వ వ్యవస్థాపక దినోత్సవాన్ని టీడీపీ నేతలు శనివారం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శనివారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am

నేను ఇచ్చేశా...బాబు అమ్ముకున్నారు వైఎస్ నిప్పులు

అసైన్డ్ భూములు ఉందని తెలుసుకున్న వెంటనే తమ కుటుంబ ఆధీనంలోని వాటిని తాను ప్రభుత్వానికి అప్పగించేశానని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములను అప్పగించే విషయంలో తాను ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవాలనే అలా చేశానన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:35 am

భారత ఇన్నింగ్స్‌కు స్టెయిన్ తెర: 627 పరుగులకు ఆలౌట్

చెన్నై చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో స్టెయిన్ విజృంభణతో భారత తొలి ఇన్నింగ్స్‌కు 627 పరుగుల వద్ద తెరపడింది. స్టెయిన్‌ జోరుకు ఎన్తిని మెరుపులు తోడవడంతో నాలుగోరోజు 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:26 am

తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత: గిలానీ

పాకిస్థాన్‌లో తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆ దేశ నూత ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. పాక్‌లో ఎర్పడిన కూటమి ప్రభుత్వం ఎజెండాలో తీవ్రవాదం అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 9:07 am

సింహాచలంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 7నుంచి జరిగే ఈ ఉత్సవాలకోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం...
Source: Yahoo! Telugu: News | 29 Mar 2008 | 8:54 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |