గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ ఎక్సెంజీ సూచి సెన్సెక్స్ 71 పాయింట్లు నష్టపోయి 16016 పాయింట్ల వద్ద ముగిసింది. అదేసమయంలో నేషనల్ స్టాక్ మార్కెట్ ఎక్సేంజీ సూచి నిప్టీ 1 పాయింట్... Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 11:04 am
ప్రస్తుత దేశ రాజకీయ వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉన్నప్పటికీ, తన పేరులో గాంధీ ఇమిడి ఉండడంతో రాజకీయరంగంలోకి తన ప్రవేశం సులభమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అంగీకరించారు. తాను ఏదో ఒక ప్రఖ్యాత వ్యక్తితో సంబంధంలో... Source: జాతీయ | 27 Mar 2008 | 10:58 am
భద్రతామండలిని విస్తరించినప్పుడు భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించేలా ఐక్యరాజ్యసమితిలో దీర్ఘకాలంగా నిలిచిపోయి ఉన్న సంస్కరణలకు తెర లేపాలని బ్రిటన్ ప్రయత్నిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వంలో మధ్యప్రాచ్య శాఖా మంత్రి డాక్టర్ కిమ్ హోవెల్స్... Source: జాతీయ | 27 Mar 2008 | 10:35 am
చెన్నై టెస్ట్లో హర్బజన్ స్పిన్ మాయాజాలంతో ఎట్టకేలకు దక్షిణాఫ్రికా జోరుకు బ్రేక్ పడింది. హర్బజన్ చెలరేగి ఐదు వికెట్లు సాధించడంతో బారీ స్కోరు దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా 540 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 10:25 am
కాపులను బీసీల్లో చేర్చే విషయంపై అధ్యయన కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. చాలాకాలంగా ఉన్న ఈ డిమాండ్పై అధ్యయనం జరిపి, కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 9:53 am
గిరిజన తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కనీసం 500 జనాభా కలిగిన తండాలన్నిటినీ పంచాయతీలుగా మార్చుతామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 9:52 am
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లుకు శాసనసభ గురువారం గ్రీన్ సిగ్నల్ అందించింది. దీంతో మండలి ఆమోదం లభిస్తే ఆ బిల్లు అమలుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో మరో వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ బిల్లుకు చట్టబద్ధత లభించగలదు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 9:45 am
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ నోటీసు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ వారు ఈ అవిశ్వాస తీర్మానం నోటీసును గురువారం స్పీకర్ ఛాంబర్లో ఆయనకు అందించారు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 9:15 am
పీసీసీ చీఫ్గా నియమితులైన ధర్మపురి శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పదవీప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణసంచా పేల్చిన కార్యకర్తలు శ్రీనివాస్కు జేజేలు పలికారు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 9:01 am
దేశంలో ప్రముఖ యోగా గురువుగా పేరున్న బాబా రాందేవ్కు ఓ బెదిరింపు లేఖ అందిందని ఉత్తరప్రదేశ్ రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఓ అనుమానిత వ్యక్తిని అరెస్టు చేసినట్టుగా వారు తెలిపారు. భారత్లో ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా... Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 7:52 am
పాకిస్థాన్లో ఉరిశిక్ష విధించబడిన సరబ్జిత్ కుటుంబాన్ని కలవడానికి పాక్ ఆపధర్మ ప్రభుత్వంలో మానవహక్కుల మంత్రిగా పనిచేసిన అన్సర్బర్నే భారత్ విచ్చేయనున్నారు. అన్సర్ భారత్ సందర్శన సందర్భంగా సరబ్జిత్ సోదరిని కూడా కలవనున్నారు. Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 7:26 am
శంషాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన విమానాశ్రయం చేరుకునేందుకై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ తెలిపింది. 35 నిమిషాల వ్యవధితో ఎంజీబీఎస్ నుంచి, నలభై నిమిషాల వ్యవధితో దిల్సుఖ్ నగర్ నుంచి. ప్రతి 45 నిమిషాల వ్యవధితో ఉప్పల్ బస్టాండ్ నుంచి... Source: Yahoo! Telugu: News | 27 Mar 2008 | 7:18 am
సినీతారలు, ఇతర ప్రముఖులు సినిమాలలో పొగతాగుతున్న దృశ్యాలలో నటించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్బుమణి రాందాస్ వ్యక్తిగతంగా అభ్యర్థించారు. నేడు వస్తున్న సినిమాలలో 80 శాతం పైగా పొగతాగుతున్న దృశ్యాలను చూపిస్తున్నాయని... Source: జాతీయ | 27 Mar 2008 | 6:58 am
అమెరికాతో అణుఒప్పందం పట్ల భారత్ భయపడనవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏ విషయానికి సంబంధించి అయినా, ఎవరితో అయినా చర్చించడానికి భారత్లో మనం భయపడటం లేదా ఆత్మవిశ్వాసాన్ని.... Source: జాతీయ | 27 Mar 2008 | 6:37 am
పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి ధర్మవరపు శ్రీనివాస్ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కొత్త రధసారథిగా బాధ్యతలు స్వీకరిస్తారు. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్లో... Source: ఏపీ న్యూస్ | 27 Mar 2008 | 5:39 am
ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులను జోనల్ పరిధిలోకి కుదిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం జీవోను విడుదల చేసింది. పద్దెనిమిది ప్రభుత్వ శాఖల్లోని 54 రకాల రాష్ట్ర స్థాయి గెజిటెడ్ పోస్టులకు జోనల్ రిజర్వేషన్ వర్తిస్తుందని..... Source: ఏపీ న్యూస్ | 27 Mar 2008 | 5:35 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2008 | 3:12 am
భవిష్యత్తులో తాను చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన నైపుణ్యాలను సాధించే లక్ష్యంతో భారత్ ఒక రోదసీ యాత్రికుడిని రష్యా అంతరిక్ష వాహకం ద్వారా రోదసీలోకి పంపనుంది. భారతీయ వ్యోమగామికి రష్యాలో శిక్షణ.... Source: జాతీయ | 26 Mar 2008 | 3:11 pm